'జనతా గ్యారేజ్' ఎటువైపు..

  • IndiaGlitz, [Saturday,March 26 2016]

ఎన్టీఆర్ - కొర‌టాల శివ‌.. టాలీవుడ్‌లో సెన్సేష‌న్ సృష్టిస్తున్న క్రేజీ కాంబినేష‌న్ ఇది. 'టెంప‌ర్‌', 'నాన్న‌కు ప్రేమ‌తో' చిత్రాల‌తో త‌న కెరీర్‌లో కొత్త డైమ‌న్ష‌న్ తీసుకున్నాక ఎన్టీఆర్ చేస్తున్న సినిమా.. 'మిర్చి', 'శ్రీ‌మంతుడు' చిత్రాల‌తో మాస్ సినిమాల‌కు క్లాస్ ట‌చ్ ఇచ్చి మ‌రీ రెండు ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నాక డైరెక్ట‌ర్ కొర‌టాల చేస్తున్న సినిమా ఒక‌టే కావ‌డంతో.. ఈ కాంబినేష‌న్‌పై క్రేజ్ పెరిగింది.

'జ‌న‌తా గ్యారేజ్' కోసం చోటు చేసుకున్న ఈ క్రేజీనెస్ ఇప్ప‌టికే బిజినెస్ వ‌ర్గాల్లో హాట్ కేక్‌గా మారింది. రిలీజ్‌కి ముందే ఈ సినిమా లాభాల బాట ప‌ట్టింది. ఇక విడుద‌ల‌య్యాక కొన్న‌వారికి, పంపిణీ చేసిన వారికి లాభాలు రావ‌డమే త‌రువాయి. అంతటి క్రేజ్‌ని సొంతం చేసుకున్న 'జ‌న‌తా గ్యారేజ్' ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.. కానీ ఇక్క‌డే ఓ మెలిక ఉంది.

అదేమిటంటే.. ఆగ‌స్టు నెల‌లో ఎన్టీఆర్ హీరోగా ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సినిమాలు వ‌చ్చాయి. వాటిలో ఒక‌టి సూప‌ర్ హిట్ కాగా.. మ‌రొక‌టి సూప‌ర్ ఫ్లాప్‌. ఆ సూప‌ర్ హిట్ 2007 ఆగ‌స్టులో వ‌చ్చిన 'య‌మ‌దొంగ' కాగా.. ఆ సూప‌ర్ ఫ్లాప్ 2014 ఆగ‌స్టులో వ‌చ్చిన 'ర‌భ‌స‌'. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి ఆగ‌స్టులో వ‌స్తున్న ఈ ఎన్టీఆర్ 'జ‌న‌తా గ్యారేజ్' ఎటువైపు అడుగులేస్తుందో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

హేబాకో ర‌కం.. సోనారిక‌కో ర‌కం..

హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత రాజ్ త‌రుణ్ న‌టించిన 'సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు' బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దాంతో త‌న త‌దుప‌రి చిత్రం 'ఈడో ర‌కం.. ఆడో ర‌కం'పై బోలెడు ఆశల‌ను పెట్టుకున్నాడు.

మా 'మీరా' చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : చిత్ర యూనిట్

ఆదిత్య,నికిత,ఇషికలు హీరో హీరోయిన్లుగా ఉనికొ సినీ స్వ్వాడ్ పతాకంపై సంతోష్ యూబులుస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ గాజుల్లా కుమార్,గాజుల్లా రమేష్ లు నిర్మించిన చిత్రం 'మీరా'.

త‌మ‌న్నా విష‌యంలో మ‌రోసారి

త‌ను న‌టించే సినిమాల విష‌యంలో త‌మ‌న్నాకి ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఆమెకి చాలా సార్లు విజ‌యాల‌ను అందించింది. నిన్న విడుద‌లై స‌ర్వ‌త్రా మంచి టాక్ తెచ్చుకున్న 'ఊపిరి' విష‌యంలోనూ అది మ‌రోసారి రుజువైంది. ఇంత‌కీ అదేమిటంటే.. స‌మ్మ‌ర్ టైంలో రిలీజ‌య్యే త‌మ‌న్నా సినిమాలు హిట్ అవుతాయ‌న్న‌ది.

పి.వి.పి కి హ్యాట్రిక్ ద‌క్కేనా..

ఇప్పుడు టాలీవుడ్ లో బాగా పాపుల‌ర్ అయిన పేరు పి.వి.పి. ర‌వితేజ హీరోగా బ‌లుపు చిత్రాన్ని నిర్మించి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించారు పి.వి.పి. బ‌లుపు త‌ర్వాత త‌మిళ్ లో విశ్వ‌రూపం, తెలుగులో వ‌ర్ణ‌, సైజ్ జీరో చిత్రాల‌ను నిర్మించినా..స‌క్సెస్ మాత్రం సాధించ‌లేక‌పోయారు.

ప‌వన్ ఫ్యాన్స్ ని టెన్ష‌న్ పెడుతున్న సెంటిమెంట్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. బాబీ తెర‌కెక్కిస్తున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్ర‌స్తుతం స్విట్జ‌ర్లాండ్ లో రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.