సింగర్ గా మారిన నటుడు జయప్రకాష్ రెడ్డి

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, క‌మెడియ‌న్‌గా 300 సినిమాల‌కు పైగా న‌టించిన న‌టుడు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి ఇప్పుడు గాయ‌కుడుగా మారారు. త‌న శివ భ‌క్తిని చాటుకుంటూ శివ ప్ర‌కాశం అనే గీతాల‌ను ఆల‌పించిన ఆల్బ‌మ్‌ను మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

తొలి ఆడియో సీడీని ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం విడుద‌ల చేసి తొలి సీడీని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్‌కు అందించారు. తాను సినిమా రంగంలోకి రాక ముందు ఉపాధ్యాయుడుగా ప‌నిచేశాన‌ని, పిల్ల‌ల‌కు నాట‌కాలు వేసేట‌ప్పుడు శిక్ష‌ణ ఇచ్చేవాడిని, కొన్ని సంద‌ర్భాలలో నేప‌థ్య గీతాలు కూడా పాడాను. ఆ అనుభ‌వంతో నా భ‌క్తిని తెలియ‌జేసేలా, నాకు న‌చ్చిన విధంగా శివ భ‌క్తిని తెలియ‌జేసేలా పాట‌లు పాడాల‌ని నిర్ణయం తీసుకున్నాను. అందుకోసం జొన్న‌విత్తుల గారిని క‌లిసి నా కోరికను తెలియ‌జేసిన‌ప్పుడు ఆయ‌న వాడుక ప‌దాల‌నుప‌యోగించి శివుని అద్భుత‌మైన పాట‌ల‌ను రాశారు. అలాగే వీణాపాణిగారు వాటికి చ‌క్క‌టి సంగీతానందించారని జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి అన్నారు.

శివుడు అంటే ఆది గురువు..స్వ‌యం శ‌క్తి. అటువంటి శివుడుకి భ‌క్తే ముఖ్యం. ప‌రిశుద్ధ‌మైన భ‌క్తితో పూజిస్తే ఎలాగైనా ఆయ‌న ప‌లుకుతాడు. అందుకు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డిగారు త‌న అపార భ‌క్తిని త‌న‌కు తోచిన విధంగా గీతాలాప‌న మార్గంలో చేశారు. జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డిగారికి వీణాపాణిగారు, జొన్న‌విత్తులగారు త‌మ వంతు స‌హకారాన్ని అందించారు. జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డికి ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్‌, నిర్మాత డి.సురేష్‌బాబు, ద‌ర్శ‌కుడు ధ‌వ‌ళ స‌త్యం ప‌లువురు అభినంద‌న‌లు తెలిపారు.

More News

పాటల చిత్రీకరణలో 'నక్షత్రం'

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో 'బుట్ట బొమ్మ క్రియేషన్స్ ' పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్,సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బన్ని....

రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`,`సరైనోడు`వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్

మహేష్ మూవీ రిలీజ్ డేట్...

సూపర్ స్టార్ మహేష్ బాబుహీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్,ఠాగూర్ మధులు భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న

ప్రముఖ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూత

తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత కె.సి.శేఖర్ బాబు

బాలీవుడ్ ఆలోచన ఉందంటున్న బాహుబలి...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.