ఈనెల 7న జీవా - కాజల్ 'ఎంతవరకు ఈ ప్రేమ'

  • IndiaGlitz, [Wednesday,April 05 2017]

'రంగం' ఫేం జీవా - కాజల్ అగర్వాల్ జంట‌గా తెర‌కెక్కిన‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'కవలై వేండాం' తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' పేరుతో అనువాద‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 'యామిరుక్క బ‌య‌మేన్‌' ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 7న (ఏప్రిల్ 7)న రిలీజ‌వుతోంది.
ఈ సందర్భంగా....
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ '' తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వ‌స్తున్న చిత్ర‌మిది. అన్ని ప‌నులు పూర్తి చేశాం. ఈనెల 7న సినిమాని రిలీజ్ చేస్తున్నాం. 'రంగం' చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను త‌మిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. అక్క‌డ పెద్ద విజయం అందుకుని ఇప్పుడు తెలుగులో వ‌స్తోంది. తెలుగు ట్రైల‌ర్స్‌, పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. జీవా, కాజ‌ల్ న‌ట‌న యువ‌త‌రానికి క్రేజీగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల్ని వంద శాతం మెప్పించే చిత్ర‌మిది'' అన్నారు.

More News

వేసవి బరిలోకి 'ఏంజెల్'

శ్రీ సరస్వితి ఫిల్మ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి శిష్యడు బాహుబలి పళని చిత్ర సీమకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

ఆ విషయంలో నా అంచనాలు తప్పుని రుజువు అయ్యాయి - మిక్కి జె.మేయర్

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా మంచి వ్యక్తి.ఆయన ఎన్నో సక్సెస్ లు సాధించాలి.

ఏప్రిల్ ద్వితీయార్ధంలో 'రక్షకభటుడు'

సాధారణంగా దెయ్యాలకు దేవుడంటే భయమని మనం చదువుతుంటాం..సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఓ దెయ్యానికి దేవుడు సహాయం చేయడం గురించి తెలుసా..అది తెలుసుకోవాలంటే `రక్షకభటుడు` సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ.

'రోగ్'తో ఇషాన్ రెండు, మూడు సినిమాల క్రెడిట్ ను సొంతం చేసుకున్నాడు - పూరి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తాన్వి ఫిలింస్ పతాకంపై జయాదిత్య సమర్పణలో ఇషాన్ని హీరోగా పరిచయంచేస్తూ డా|| సి.ఆర్. మనోహర్, సి.ఆర్. గోపి నిర్మించిన చిత్రం 'రోగ్' మరో చంటిగాడి ప్రేమకథ. ఈ చిత్రం మార్చి 31న తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్వైడ్గా రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ని సాధించింది.

'మరకతమణి' మెషన్ పోస్టర్ విడుదల

'సరైనోడు' లాంటి బ్లాక్బస్టర్ చిత్రంలో వైరం ధనుష్ పాత్రలో అందరిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం "మరకతమణి". ఇటీవలే 'మలుపు' లాంటి కాన్సెప్టెడ్ కమర్షియల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గర్లాని మరోక్కసారి జంటగా చేసిన మరకతమణి యెక్క మెషన్ పోస్టర్ విడుదల చేశారు.