జూన్ లో నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావుల హ‌థీరామ్ బాబా..

  • IndiaGlitz, [Thursday,April 21 2016]

మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించడంతో పాటు స‌రికొత్త రికార్డులు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. ఈ మూడు చిత్రాల‌తో వ‌రుస‌గా 40 కోట్లు షేర్ సాధించి... స‌రికొత్త రికార్డ్ సాధించి... నేటిత‌రంలో త‌నకున్న క్రేజ్ ఏమిటో చెప్ప‌క‌నే చెప్పారు నాటిత‌రం హీరో నాగార్జున‌. ఈ స‌క్సెస్ ను ఇలాగే కంటిన్యూ చేసేలా వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్న నాగ్ త‌దుప‌రి చిత్రాన్ని రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు.

తూర్పు గోదావ‌రి జిల్లాలో నిర్మ‌లా కాన్వెంట్ షూటింగ్ లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ... రాఘ‌వేంద్ర‌రావు గారి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న‌ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. హ‌థీరామ్ బాబా జీవిత చ‌రిత్రతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని జూన్ లో ప్రారంభించ‌నున్నాం అని తెలియ‌చేసారు. ఈ చిత్రానికి ఓం న‌మో వెంక‌టేశాయ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలియ‌చేయ‌నున్నారు. మ‌రి..నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావుల క‌ల‌యిక‌లో రూపొందిన అధ్యాత్మిక అద్భుతాలు అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి...చిత్రాల వ‌లే హ‌థీరామ్ బాబా చిత్రం కూడా అథ్యాత్మిక అధ్భుత చిత్రంగా నిలుస్తుంద‌ని ఆశిద్దాం.

More News

ర‌కుల్ కి మ‌రో అవ‌కాశం ఇచ్చిన బోయ‌పాటి..

డైరెక్ట‌ర్ బోయ‌పాటి తెర‌కెక్కించిన స‌రైనోడు సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో ర‌కుల్ అందం - అభిన‌యం బోయ‌పాటికి బాగా న‌చ్చింది అనుకుంట‌. త‌న త‌దుప‌రి చిత్రంలో కూడా ర‌కుల్ కి అవ‌కాశం ఇచ్చారు.

బాలయ్యతో ఇలియానా..?

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి. జె.సాయిబాబు నిర్మాతలుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో  రూపొందనుంది. రేపు సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే దానిపై చాలా వార్తలు వినిపించాయి.

ధ‌నుష్ కు నో..మ‌హేష్ కు ఎస్ చెప్పిన సూర్య‌..

ధ‌నుష్ కు నో..మ‌హేష్ కు ఎస్ చెప్పిన సూర్య అన‌గానే..హీరో సూర్య అనుకుంటే పొర‌పాటే. మ‌రి ఎవ‌రంటారా..?  డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమా త‌ర్వాత మురుగుదాస్ తో ఓ సినిమా చేయ‌నున్నారు.

క‌బాలి రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో ర‌జ‌నీ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది.  ఈ చిత్రాన్ని క‌లై ఫులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 29న విడుదలవుతున్న 'పిడుగు'

వినీత్‌, మోనికా సింగ్ హీరో హీరోయిన్లుగా వి2 ఫిల్మ్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై రామ‌మోహ‌న్.సి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో అశోక్ గోటి నిర్మించిన చిత్రం'పిడుగు'. ఈ చిత్రం ద్వారా నిర్మాత అశోక్ గోటి త‌న త‌న‌యుడు వినీత్‌ను హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు.