close
Choose your channels

ప్రాణాలతో బయటపడ్డా.. తెలిసొచ్చింది: కాజల్

Thursday, February 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రాణాలతో బయటపడ్డా.. తెలిసొచ్చింది: కాజల్

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భారతీయుడు-2’. ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అవ్వడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమందికి గాయాలయ్యాయి. ఈ ఘోర ఘటనపై ఇదివరకే లైకా సంస్థ అధినేత, కమల్ ట్విట్టర్ స్పందించారు.

ప్రాణాలతో బయటపడ్డా!

తాజాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘సహచరులను కోల్పోవడం బాధగా ఉంది. సహాయ దర్శకుడు కృష్ణ, ప్రొడక్షన్ అసిస్టెంట్లు మధు, చంద్రన్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఆ క్షణ కాలం, జీవితం విలువను తెలిసొచ్చేలా చేసింది’ అని కాజల్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాజల్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమెకు ధైర్య చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ప్రమాదస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్రేన్‌ ఆపరేటర్‌ రాజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.