కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్... హెల్త్ బులెటిన్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,December 01 2021]

కరోనా వైరస్ బారినపడిన విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం చెన‍్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. కమల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ నెల 3న ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి కమల్‌ హాసన్‌ తన రోజువారీ పనుల్లో నిమగ్నం అవ్వవచ్చని వైద్యులు తెలిపారు.

కాగా.. కొద్దిరోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లి తిరిగి భారతదేశానికి వచ్చిన కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. ఒంట్లో నలతగా వుండటంతో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో కమల్‌ కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది. దీంతో చికిత్స కోసం నవంబర్‌ 22న ఆయన చెన్నైలోని శ్రీ రామచంద్రా మెడికల్ సెంటర్‌లో చేరారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని.. అంతా అప్రమత్తంగా వుండాలని ఇదిలా ఉండగా కమల్‌ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉ‍న్నారు. కమల్‌హాసన్, ఫాహద్‌ ఫాజిల్, విజయ్‌ సేతుపతి కలయికలో లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘విక్రమ్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా సమాచారం. అలాగే తమిళ దర్శక దిగ్గజం శంకర్‌ దర్శకత్వంలో భారతీయుడు 2లో కూడా కమల్ హాసన్ నటిస్తున్నారు.

More News

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. యాక్సిడెంట్‌లో హీరో సోదరుడు దుర్మరణం

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: మానస్‌పై కోపం.. హౌస్‌లో గొడవలన్నింటికీ ఆమె కారణం, కాజల్‌పై అరిచేసిన పింకీ

బిగ్‌బాస్ 5 తెలుగులో మరోసారి  నామినేషన్ల వల్ల రచ్చ లేచింది. సోమవారం నాటి నామినేషన్స్ సందర్భంగా ఇంటి సభ్యులు డిస్కషన్ చేసుకున్నారు.

'గేమ్ ఆన్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "గేమ్ ఆన్" సినిమా రవి కస్తూరి సమర్పణలో

‘స్కై లాబ్‌’ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంది : హీరో స‌త్య‌దేవ్‌

వెర్సటైల్ యాక్టర్స్ స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో

ఈ దర్శకులు సినిమా తీస్తే.. ఆయన పాట వుండాల్సిందే, ఇది ‘‘ సిరివెన్నెల ’’ ప్రస్థానం..!!

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.