మిలిటరీ ట్రైనింగ్ అకాడమీలో కమల్ 'విశ్వరూపం 2'

  • IndiaGlitz, [Friday,December 01 2017]

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విశ్వరూపం 2' (హిందీలో విశ్వరూప్ 2). ఈ మూవీ షూటింగ్ తిరిగి చెన్నైలో మొదలైంది. స్వీయదర్శకత్వంలో నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ ఫిలింలో కమల్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఆఖరి షెడ్యూల్ ని చెన్నైలో గల ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటిఎ)లో చిత్రీకరిస్తున్నారు.

ఈ అకాడమీలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ని షూట్ చేయడం చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉందని చెప్తూ కొంత మంది ఆఫీసర్స్ తో ఫొటోస్ కూడా దిగారు కమల్. లేడీ ఆఫీసర్స్ ని ట్రైన్ చేసే ఏకైక అకాడమీ చెన్నై లో మాత్రమే ఉందని, ఇక్కడున్న లేడీ ఆఫీసర్స్ తో పాటు భారత్ మాతాకి జై అంటూ మా తుజ్హే సలాం అని ఫొటోస్ తో ఈ ట్వీట్ ని కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.

తమిళ్, తెలుగు, హిందీలో ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శేఖర్ కపూర్, రాహుల్ బోస్, పూజాకుమార్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని తొందరలోనే ఖరారు చేస్తారు.

More News

డిసెంబర్ 8న విడుద‌ల‌వుతోన్న 'బీటెక్ బాబులు'

నందు, శౌర్య‌, శ్రీముఖి, రోషిణి ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్  పై ధ‌న జమ్ము నిర్మించిన చిత్రం 'బీటెక్ బాబులు'. శ్రీను ఈ మంది దర్శకత్వం వ‌హించారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని తెలుగు రాష్ర్టాల్లో  డిసెంబ‌ర్ 8న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. 

నాగార్జున చేతుల మీదుగా 'ఏక్‌' మూవీ ఆడియో విడుదల

కె వరల్డ్ మూవీస్ బ్యానర్ పై రుద్రారపు సంపత్ డైరెక్షన్ లో బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ హీరోహీరోయిన్లుగా నిర్మాత హరికృష్ణ నిర్మించిన చిత్రం 'ఏక్'.

బాలకృష్ణ 'జై సింహా' టాకీ పార్ట్ పూర్తి

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార

'సైరా' గురించి క్లారిటీ ఇచ్చిన థమన్

'ఖైదీ నెం.150' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. చిరు 151వ చిత్రంగా 'సైరా' రూపుదిద్దుకుంటోంది.

'భరత్ అనే నేను' ఆడియో రైట్స్.. ఆ సంస్థకే

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.