'కర్త కర్మ క్రియ' ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Saturday,November 03 2018]

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తొన్న కర్త క్రియ కర్మ సినిమా ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్స్ లొ విడుదల చేశారు. వీకెండ్ లవ్ ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ సినిమాలకంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. వినాయక రావు గారి వల్ల ఈ సినిమా తెరమీదకు వచ్చింది.

నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసేలా ఉంటుంది. ట్రైలర్ ఎంత గ్రిప్పింగ్ గా ఉందో సినిమా అంతకుమించి ఉంటుంది. కథ చెప్పిన దాని కంటే ది బెస్ట్ గా ఈ సినిమాను బాధ్యత గా తీశారు.నవంబర్ 8 న చిత్రాన్ని విడుదల చెస్తాము‌. మా సూపర్ హిట్ చిత్రం బిచ్చగాడు తరహాలొ నాగు గవర 'కర్త కర్మ క్రియ' సక్సెస్ కావాలన్నారు.

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కధ ఇది. మనం రోజు చూసె ,వినె కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన ఎలిమెంట్ తో ఈ కర్త కర్మ క్రియ ను రూపొందిస్తున్నాము. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది.మంచి టీమ్ సినిమాకు సెట్ కావటంతో పాటు, నిర్మాతల సపోర్ట్ మా సినిమాకు ప్రధాన బలం.

పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయానికి ఈ సినిమాను కంప్లీట్ చెశాము. హీరొ హీరొయిన్ లు కొత్త వారైనా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్ గా అంతే ఉత్తమం గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తీశాము. మాటీమ్ అందరికీ పేరొస్తుందన్న నమ్మకముందన్నారు.

More News

టాలీవుడ్ కి సరికొత్త అందాల 'నిధి'..!!

నిధి అగర్వాల్.. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయం అవుతుంది.

చివరి షెడ్యూల్ లో అల్లు శిరీష్ "ఏబీసీడీ" చిత్రం

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

టాలీవుడ్ లొ సంచ‌నాలు క్రియోట్ చేస్తున్న 'ఏడు చేపల కథ' టీజ‌ర్‌

యూట్యూబ్ లో అప్‌లోడ్ అవుతుంది 5 నిమిషాలు... నీకుంట‌ద‌మ్మో..మా అమ్మ‌కి చెబుతా..

2.0 జీవితంలో మ‌ర్చిపోలేను - ఎమీ జాక్స‌న్

ఎమీ జాక్స‌న్ మాట్లాడుతూ '' నేను చాలా నెర్వ‌స్‌గా ఉన్నా. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా గొప్ప గౌర‌వం. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వ‌ల్ల‌నే నా క‌ల నెర‌వేరింది.

'2.0' గురించి నీర‌వ్ షా

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా '2.0'.