'ఖాకి' ప్రమోషన్స్పై సంతోషాన్ని వ్యక్తం చేసిన కార్తి,రకుల్

  • IndiaGlitz, [Thursday,November 23 2017]

తెలుగులో రెండు దశాబ్దాలుగా ఆడియో రంగంలో టాప్ పోజిషన్లో ఉన్న ఆదిత్య మ్యూజిక్..తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా 'ఖాకి' చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్తో తిరుగులేని సక్సెస్ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, సోషల్ మీడియాల ద్వారా సినిమాను ప్రేక్షకులకు రీచ్ చేయించారు.

దీని గురించి హీరో కార్తి మాట్లాడుతూ "ఆదిత్య మ్యాజిక్ వారు మా ఖాకి చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం హ్యాపీగా ఉంది. ముందు ఈ సినిమాను తెలుగులో ఎవరు తీసుకున్నారని అడిగినప్పుడు ఆదిత్య మ్యూజిక్ వారు అన్నారు. అయితే వారు ఆడియో రైట్స్ తీసుకున్నారనుకున్నాను. కానీ వారు సినిమా థియేట్రికల్ రైట్స్ తీసుకుని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విడుదల చేశారు. ఇలాంటి వ్యక్తుల ద్వారా సినిమా విడుదలవుతుందంటే..సినిమా చాలా జాగ్రత్తగా ఉన్నట్లే లెక్క. ప్రమోషన్స్లో ప్రతి చిన్న విషయాన్ని కేర్ తీసుకుని చేశారు. భవిష్యత్లో వారు చేయబోయే సినిమాలు కూడా ఇలాగే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఖాకి చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. హెచ్.వినోద్ దర్శకుడు.

More News

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డం లేదు...

ఈ మ‌ధ్య త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వార్త‌ల్లో  నిలుస్తున్నాయి. ప్రేక్ష‌కుల్లో మాస్ ఇమేజ్ ఉన్న ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని వార్త‌లు వినిపించాయి.

డిసెంబర్ 8న సుమంత్ మళ్లీ రావా చిత్రం

శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలోరాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా' ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ చిత్ర ఆడియో టీజర్ ను వి

ఇద్ద‌రిలో ఎవ‌రితో...

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు మెచ్చే విధంగా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుల్లో వినాయ‌క్ ముందుంటారు. ఈయ‌న ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కాగానే వినాయ‌క్ చేయ‌బోయే సినిమాకు ఇద్ద‌రు హీరోల పేర్లు వినప‌డుతున్నాయి.

'సప్తగిరి ఎల్‌ ఎల్‌ బి' చిత్రంలో సప్తగిరి డాన్సులు ఇరగదీశాడు - వి.వి.వినాయక్‌

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

నవంబ‌ర్ 24న 'హేయ్ ..పిల్ల‌గాడ‌'

'ఓకే.. బంగారం' స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గరైన క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు మూవీ మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.