close
Choose your channels

ఇద్ద‌రిలో ఎవ‌రితో...

Wednesday, November 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు మెచ్చే విధంగా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుల్లో వినాయ‌క్ ముందుంటారు. ఈయ‌న ఇప్పుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కాగానే వినాయ‌క్ చేయ‌బోయే సినిమాకు ఇద్ద‌రు హీరోల పేర్లు వినప‌డుతున్నాయి.

అందులో ఒక‌రు మెగా క్యాంప్ హీరో వ‌రుణ్ తేజ్ కాగా, మ‌రో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లుడు శీను సినిమాతో శ్రీనివాస్ హీరోగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ యువ హీరో కూడా వినాయ‌క్‌తో న‌టించాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు.

ఈ సినిమాకు న‌ల్ల‌మ‌లుపు బుజ్జి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌నే పేరుంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదైలెందని సమాచారం. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.