close
Choose your channels

పెళ్లి చేసుకోనున్న 23 ఏళ్ల మేయ‌ర్, 28 ఏళ్ల ఎమ్మెల్యే, ముహూర్తం ఎప్పుడంటే..?

Wednesday, February 16, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుత పరిస్ధితుల్లో రాజకీయాలకు యువత దూరమవుతున్న సంగతి తెలిసిందే. అయితే డాక్టర్, లేదంటే ఇంజనీరింగ్ చదివి జీవితంలో స్థిరపడాలని చూస్తున్నారు. ఇవి కాకుండా ఏదో ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పోటీ పరీక్షలు రాస్తున్నారు తప్పించి.. ఎవరూ రాజకీయాలవైపు తొంగి చూడటం లేదు. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం .. యువత ఉత్సాహంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులుగా గెలుస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

తాజాగా దేశంలోనే అత్యంత చిన్న వ‌య‌స్కురాలైన మేయ‌ర్ ఆర్య రాజేంద‌ర్, యంగ్ ఎమ్మెల్యే స‌చిన్ దేవ్ ఇద్దరూ పెళ్లి బంధం ద్వారా ఒక్కటవుతూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కేరళ రాజధాని తిరువ‌నంత‌పురం మేయ‌ర్ గా ఆర్య‌, బ‌లుస్సేరి ఎమ్మెల్యేగా స‌చిన్ దేవ్ ఉన్నారు. ఆర్య వ‌య‌సు 23, కాగా స‌చిన్ వ‌య‌సు 28. వీరి పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిరింది, అయితే వివాహ తేదీ ఎప్పుడనేది మాత్రం తెలియరాలేదు. ఆర్య, సచిన్‌లు చిన్ననాటి స్నేహితులు, అంతేకాదు ఎస్‌ఎఫ్‌ఐలో కలిసి పనిచేశారు కూడా.

23 ఏళ్ల ఆర్య రాజేంద్రన్ మనదేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డుల్లోకెక్కారు. ఆమె తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి కార్పోరేటర్‌గా గెలిచారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు ఆమెను మేయర్‌గా ఎన్నుకున్నారు. ఆ సమయంలో ఆర్య వయసు (21) సంవత్సరాలే. ఇక సచిన్ విషయానికి వస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అది అలాంటి ఇలాంటి విజయం కాదు.. ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి సచిన్ గెలిచారు. దీంతో కేరళలో అతిచిన్న వయస్సులో ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.