కోనకి కోపం వచ్చింది..

  • IndiaGlitz, [Friday,December 04 2015]

స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ క‌థ‌, క‌థ‌నం అందించ‌డంతో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ మూవీలో నిఖిల్, నందిత జంట‌గా న‌టించారు. ఎన్నో అంచ‌నాల‌తో శంక‌రాభ‌ర‌ణం ఈరోజు రిలీజైంది. అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిన ఈ మూవీలో ఓ డైలాగ్ ఉంది. అదేమింటంటే...పాపుల‌ర్ అవ్వాలంటే సినిమా తీసి పాపుల‌ర్ అవ్వాలి..సినిమాని తిట్టి కాదు..అని. కోన ఈ డైలాగ్ పెట్ట‌డానికి ఓ కార‌ణం ఉంది. అది ఏమిటంటే...కోన క‌థ‌లు గురించి గ‌తంలో రొటీన్ గా ఉంటున్నాయంటూ వార్త‌లు వ‌చ్చాయి. అది కోన‌కి బాగా కోపం తెప్పించిన‌ట్టుంది. అంతే...ఈ సినిమాలో పాపుల‌ర్ అవ్వాలంటే సినిమా తీసి పాపుల‌ర్ అవ్వాలి. సినిమాని తిట్టి కాదు అంటూ మీడియా పై సెటైర్ వేసేసాడు. కోన క‌థ‌లు ఎలా ఉంటున్నాయో అంద‌రికీ తెల‌సిందే. వాస్త‌వం చెబితే త‌ట్టుకోలేక‌పోవ‌డం...విమ‌ర్శ ఏదో...స‌ద్విమ‌ర్శ ఏదో తెలుసుకోలేక‌పోవ‌డం..ఏమిటి కోన ఇది..?

More News

సునీల్ మూవీ టైటిల్...

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ సినిమా విడుదలైన చాలా కాలమైంది.ప్రస్తుతం కృష్ణాష్టమి విడుదలకు సిద్ధమవుతుంది.

శంకరాభరణం మూవీ రివ్యూ

ఈ మధ్య తెలుగు సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే తిరుగుతుంది. తను కూడా తిరిగితే తప్పేంటి అనుకున్నాడేమో కానీ స్టార్ రైటర్ పట్టంతో ఉన్న కోనవెంకట్ ఇప్పుడు అలాంటి కథను రాసుకున్నాడు. అత్తారింటికి దారేది, పండగచేస్కో సినిమాల తరహాలో ఈ సినిమా అంతా ఎన్నారైల చుట్టూనే నడిపాడు.

చెన్నై వరద బాధితులకు రూ.15 లక్షల విరాళం ప్రకటించిన కృష్ణంరాజు, ప్రభాస్

ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు రూ.5లక్షలు ప్రకటించిన ప్రభాస్.భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే.

'సౌఖ్యం' టీజర్ రెడీ..

గోపీచంద్,రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం సౌఖ్యం.ఈ చిత్రాన్ని పిల్లా నువ్వులేని జీవితంతో ఇటీవల విజయం సాధించిన ఎ.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్నారు.

వరద భాధితులకు లారెన్స్ భారీ సాయం..

కొరియోగ్రాఫర్ గా,డైరెక్టర్ గా,కథానాయకుడుగా...ఇలా సినిమా రంగంలో తను ప్రవేశించిన ప్రతి శాఖలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మల్టీ టాలెంటెడ్ పర్సన్ రాఘవ లారెన్స్.