close
Choose your channels

చెన్నై వరద బాధితులకు రూ.15 లక్షల విరాళం ప్రకటించిన కృష్ణంరాజు, ప్రభాస్

Friday, December 4, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులకు రూ.5 లక్షలు ప్రకటించిన ప్రభాస్‌ . భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 9 జిల్లాలు వరద తాకిడికి గురైన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా చెన్నై పట్టణం ముంపుకు గురి కావడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది నిరాశ్రయులు కావడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కలిసి వరద బాధితులకు 15 లక్షల రూపాయల విరాళాన్ని అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌కు రూ.5 లక్షలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాలు ఈ వరదల తాకిడికి గురయ్యాయి. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల సహాయార్థం యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.