అనారోగ్యంపై స్పందించిన రెబల్‌స్టార్ కృష్ణంరాజు

  • IndiaGlitz, [Thursday,November 14 2019]

ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తన ఆరోగ్యంపై నిన్న కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. ‘కేవలం న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్‌గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్ళటం చూసిన కొన్ని పత్రికల వారు కనీస విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా వార్తలు రాశారు. ఇందువల్ల హాస్పిటల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్స్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్ళి పోతాను. నా ఆరోగ్యం విషయంగా ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అని రెబల్ స్టార్ అన్నారు.

More News

‘మళ్లీ చెప్తున్నా.. అగౌరపరిస్తే మట్టిలో కలిసిపోతారు’

‘మట్టిలో కలిసిపోతారు అనే మాట నేను ఆవేశంలో అనలేదు. తెలుగు భాషని మీరు అగౌరపరిస్తే మట్టిలో కలిసిపోతారు మళ్లీ చెప్తున్నా. భాషల్ని గౌరవించే సంప్రదాయం మా పార్టీది’ అని

బాబు దీక్ష రోజే ఝలక్.. దేవినేని రాజీనామా.. వైసీపీలోకి!

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన దీక్షకు దిగిన రోజే విజయవాడకు చెందిన ముఖ్యనేత

జగన్‌ను.. ‘జగన్ రెడ్డి’ అనడంపై పవన్ వివరణ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని.. జగన్ రెడ్డి అంటున్నందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే.

ఏఎన్నార్ జాతీయ అవార్డ్స్: చిరు చేతుల మీదుగా ప్రదానం

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు పేరుతో ‘అక్కినేని అవార్డులు’ ఇవ్వడం మొద‌లెట్టిన విషయం తెలిసిందే. ఆయన మరణాంతరం ఆ ప‌రంప‌ర‌ని ఏఎన్నార్ కుమారుడు అక్కినేని నాగార్జున కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.

నిన్న లతా మంగేష్కర్.. నేడు కృష్ణంరాజు..!

సినీ ఇండస్ట్రీ నుంచి వరుస షాకింగ్ న్యూస్‌లు వస్తున్నాయి. ఆ షాకింగ్ న్యూస్‌లతో వారి అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు!.