KTR:సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి భయం.. ఆడియో కాల్ వైరల్..

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ప్రచారానికి ఇంకో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలను బ్యాడ్ చేసేలా వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడిన ఓ ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిరిసిల్లలో ఓడిపోతామని కేటీఆర్‌కు భయం చుట్టుకుందని ఈ ఫోన్ కాల్‌లో క్యాడర్‌ను బతిమాలుకుంటున్నారని కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేసింది.

ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాలో ప్రచారంతో అదరగొడుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ లీక్‌ చేసింది. కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో క్యాడర్ ప్రచారానికి వెళ్లాలంటేనే వెనకాడుతున్నారని.. కేటీఆర్ ఓడిపోవడం ఖాయం అంటోంది. అందుకే ఫోన్లు చేసి మరీ బతిమాలుకునే పరిస్థితికి కేటీఆర్‌కు వచ్చారని ఆ పోస్టులో పేర్కొంది.

ఆ ఆడియో కాల్ పరిశీలిస్తే.. ఎన్నికలకు ఇంకో వారం రోజులే ఉందని మళ్లీ వచ్చే మంగళవారానికి ప్రచారం ముగిసిపోతుందని అన్నారు. ఈ లోపు ప్రతి ఒక్క నేత ఇంటింటి ప్రచారం చేయాలని కోరారు. నియోజకవర్గంలో తాను ఓడిపోతానని ఎవరో ఏదో చెబుతున్నారని అలాంటివి పట్టించుకోవద్దని తెలిపారు. బీఆర్ఎస్ నేతల్లోనే పుకార్లు పుట్టించి ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే పది మంది పది రకాలుగా మాట్లాడుకుంటున్నారని అవన్నీ బంద్‌ చేయాలని పేర్కొన్నారు. దయచేసి ఇలాంటి గాలి మాటలు నమ్మకుండా ప్రచారంపై ఫోకస్ చేయాలని మంత్రి విజ్ఞప్తిచేస్తున్నారు. దీంతో కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

More News

Kannappa : మంచు విష్ణు ‘‘కన్నప్ప’’ ఫస్ట్ లుక్ చూశారా.. సినిమాపై అంచనాలు పెంచేసిందిగా.. !!

మంచువారి వారసుడు విష్ణు.. హిట్టు కొట్టి చాలా ఏళ్లే అవుతోంది. ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా ఆయనకు గెలుపు దక్కడం లేదు.

BRS Party: బీఆర్ఎస్ పార్టీదే మళ్లీ అధికారం.. న్యూస్‌టాప్ సర్వేలో స్పష్టం

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని న్యూస్ టాప్ సర్వే తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం నవంబర్ 16 నుంచి 21 మధ్య ఈ సర్వే చేశామని..

ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా.. బీసీ సీఎంను చూడాలి: పవన్

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య నువ్వానేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో

Akbaruddin Owaisi: పోలీసులను బెదిరించడంతో అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో నేతలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ