close
Choose your channels

KTR:ముఖ్యమంత్రి గారు.. రైతుల కన్నీళ్లు కనిపించవా..?: కేటీఆర్

Wednesday, March 20, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రైతులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కొత్త అర్థం చెప్పారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని వ్యాఖ్యాలనించారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

'ముఖ్యమంత్రి గారు..
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?
నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..
నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..
ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..
గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా...?
అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??
ఎన్నికల గోల తప్ప..
ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..?
సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప..
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..??
ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..?
పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంటనష్టంపై లేదెందుకు ??
పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా ?
హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ..
రైతుల సమస్యలు వినే ఓపిక లేదా ?
ఇంతకాలం..
పచ్చని పైర్లు ఎండుతున్నా.. సాగునీరు ఇవ్వడం చేతకాలేదు..!
ఇప్పుడు..
నష్టపోయిన పంటలకు.. పరిహారం ఇవ్వాలన్న మనసు రావడం లేదా..?
గుర్తు పెట్టుకోండి..!!
ఎద్దేడ్సిన ఎవుసం..! రైతేడ్సిన “రాజ్యం బాగుండదు ..” !!
అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై..
భారత “రైతు” సమితి.. పోరాడుతూనే ఉంటది..!!!' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతకాలంగా కేటీఆర్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తాయని.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పోరాటాలకు సిద్ధమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.