జనసేనలో చేరిన కూసంపూడి శ్రీనివాస్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం నేతల జంపింగ్లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు గోడ దూకిన విషయం విదితమే. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, సిట్టింగ్లు, మాజీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అధికార పార్టీ వైసీపీ నుంచి కూడా బీజేపీ, టీడీపీలోకి నేతలు జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో జనసేనాని కూడా నేతలను చేర్చుకునేందుకు డోర్లు తెరిశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా రాజకీయ విశ్లేషకులు, లోక్ సత్తా పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్కు జనసేన కండువా కప్పి అధినేత పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. కూసంపూడి శ్రీనివాస్ పార్టీలో చేరడం చాలా ఆనందమన్నారు. శ్రీనివాస్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పవన్ తెలిపారు.
చేరిక అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనసేన పార్టీలో చేరడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న ఒక యోధుడికి మద్దతుగా ఉండాలనే పార్టీలో చేరానన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానని శ్రీనివాస్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.