లక్ష్మి నిలయం చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Monday,November 13 2017]

విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మణ్ కంచరి దర్శకనిర్మాతగా గౌతమి, శిరీష్ ముఖ్యతారాగణం తో నిర్మిస్తున్న చిత్రం లక్ష్మి నిలయం . ఈ చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభం అయింది.

ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ముహూర్తం షాట్ కి క్లాప్ ఇచ్చి శుభారంభం పలికారు. దర్శకనిర్మాత లక్ష్మణ్ కంచరి తండ్రిగారు ఈశ్వరయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా తన సోదరుడు వెంకటేష్ తొలిషాట్ డైరెక్షన్ చేసారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో దర్శకనిర్మాత లక్ష్మణ్ కంచరి మాట్లాడుతూ "ఇది ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కథ. సమాజం లో మహిళపై వేధింపులు ఎలా ఉన్నాయి వాటిని మహిళలు ఎలా ఎదురుకోవాలి , షీ టీమ్ ని ఎలా సంప్రదించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కథాంశం తో నిర్ణిస్తున్న చిత్రం ఇది.

డిసెంబర్ రెండో వరం లో చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ మరియు మెదక్ పరిసరప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి లో షూటింగ్ పూర్తిచేసుకొని ఏప్రిల్ లో చిత్రం విడుదల కి సన్నాహాలు చేస్తున్నాం .

More News

రేపు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్న అఖిల్‌

అఖిల్ చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అక్కినేని అఖిల్‌.. ప్ర‌స్తుతం మ‌నం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.45 కోట్ల బ‌డ్జెట్‌తో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

దేవిశ్రీ ప్ర‌సాద్ చిత్రంతో..ధ‌న‌రాజ్ ఏ పాత్ర అయినా బాగా చేస్తాడ‌నే మంచి పేరొస్తుంది - ధ‌న‌రాజ్‌

యశ్వంత్ మూవీస్ సమర్పణలో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్నచిత్రం 'దేవిశ్రీప్రసాద్'. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మ‌నోజ్ నందం ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

మాల్స్‌లో నా పేరు సూర్య‌

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ త‌రువాత అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం నాపేరు సూర్య‌. నా ఇల్లు ఇండియా అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు.

అల్లు శిరీష్‌ షూటింగ్‌లో ప‌వ‌ర్‌స్టార్‌

త‌న గ‌త చిత్రం శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు అల్లు వారి క‌థానాయ‌కుడు అల్లు శిరీష్.  ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క క్ష‌ణం చేస్తున్నాడు.

నాగ్‌,వ‌ర్మ చిత్రంలో అమితాబ్?

24 ఏళ్ల త‌రువాత కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాని ఏప్రిల్ 20న విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది