రజనీతో లారెన్స్..!

  • IndiaGlitz, [Saturday,September 10 2016]

కొరియోగ్రాఫ్ గా, న‌టుడుగా, సంగీత ద‌ర్శ‌కుడుగా, ద‌ర్శ‌కుడుగా...ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో స‌క్సెస్ సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్. వీట‌న్నింటికి మించి...ఒక ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి పేద‌ల‌కు ఎంత‌గానో స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న గొప్ప మాన‌వ‌తావాది. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ను లారెన్స్ క‌లుసుకున్నారు. పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో లారెన్స్ శివ‌లింగ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి ర‌జ‌నీకి వివ‌రించారు. అలాగే రాఘ‌వేంద్ర‌స్వామి దేవాలయం, త‌ల్లికి క‌ట్టిస్తున్న దేవాలయం గురించి ర‌జ‌నీకి చెప్పి త‌న సంతోషాన్ని పంచుకున్నారు. పేద‌ల‌కు చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు గురించి తెలుసుకుని లారెన్స్ ను ర‌జ‌నీ అభినందించారు. ర‌జ‌నీ సార్ ని క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని లారెన్స్ తెలియ‌చేసారు.

More News

చిరును రికార్డ్ ను మహేష్ దాటేస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ మూవీ 'ఖైదీ నంబర్ 150' వ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోయిన్....

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,దిల్ రాజు,హరీష్ శంకర్,దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం డిజె..దువ్వాడ జగన్నాథమ్.

మరోసారి ఆ దర్శకుడితోనే నయన...

తెలుగు,తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార,దర్శకుడు గణేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతుంది.

పవన్ కాకినాడ సభలో ఒకరు మృతి

జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవం పేరుతో

నేను - నాన్న అద్భుతమైన క్షణాలు - ప్రభుదేవా

తనదైన శైలిలో డ్యాన్స్ చూసి...యూత్ ను ఎంతగానో ఆకట్టుకుని ఇండియన్ మైకేల్ జాక్సన్ అనిపించుకున్న గ్రేట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా.