దిగ్గజ నటుడు టీ.రాజేందర్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చికిత్స

  • IndiaGlitz, [Monday,May 23 2022]

దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు టీ.రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితతం ఆయన అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను సింగపూర్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

రాజేందర్ సతీమణి ఉషా రాజేందర్, కుమారుడు శింబు ఆయన పక్కనే వున్నారని .. ఒకవేళ సింగపూర్‌కి తరలించే పక్షంలో ఆయనతో కలిసే విదేశాలకు వెళతారని సమాచారం. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు.. రాజేందర్ కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

More News

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ, సమంత 'ఖుషి'

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా "ఖుషి" ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఇకపై మహిళల కోసం సినిమాలు చేస్తా .. పెద్ద కలలు కనండి: భారతీయ అమ్మాయిలకు పూజా హెగ్డే సూచనలు

ప్రస్తుతం సౌత్‌తో పాటు నార్త్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది పూజాహెగ్డే. ‘‘ఒక లైలా కోసం’’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది

వనజీవి రామయ్యకు పవన్ పరామర్శ.. వీడియో కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్న జనసేనాని

రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, పద్మశ్రీ వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అంబరాన్నంటిన ర్యాలీ "ఆటా" అందాల పోటీలు

జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ డి.సి.లో జరిగే 17వ అటా కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో భాగంగా మే 14వ తేదీన రాలీ,

‘శేఖర్’ సినిమా ప్రదర్శన నిలిపివేత.. కుట్రలు చేసి అడ్డుకున్నారు, ఎంతో కష్టపడ్డాం: రాజశేఖర్ సంచలన పోస్ట్

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం శేఖర్.