నెటిజన్‌ కౌంటర్‌కి మాధవన్ రిప్లై

  • IndiaGlitz, [Saturday,August 17 2019]

తమిళ నటుడైన మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన తమిళ చిత్రాలు సఖి, చెలి, యువ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. తెలుగులో ఈయన సవ్యసాచిలో నెగెటివ్ పాత్రలో నటించారు. తాజాగా అనుష్కతో కలిసి 'నిశ్శబ్ధం'లో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరల్లో ఈ చిత్రం విడుదల కానుంది. రీసెంట్‌గా రాఖీపౌర్ణమిని పురస్కరించుకుని తన కొడుకు, తండ్రితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు మాధవన్. దీనిపై పలువురు తమ స్పందనను తెలియజేశారు.

అయితే ఓ నెటిజన్ స్పందిస్తూ... ''జీసస్ శిలువలు, ఫొటోలు పూజా మందిరాల్లో ఉంటాయా? ఇదంతా సెట్ అప్.. దీని కారణంగా మీపై ఉన్న గౌరవం పోయింది'' అంటూ స్పందించాడు. దానికి మాధవన్ రిప్లై ఇస్తూ..''సంకుచిత భావాలున్న నీలాంటి వ్యక్తుల రెస్పెక్ట్ నాకు అవసరం లేదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను. గుళ్లకే కాదు చర్చికి, మసీదుకి కూడా వెళతాను'' అన్నారు. మాధవన్ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

More News

'అ!' సీక్వెల్‌లో టాప్ స్టార్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మాతగా మారి రూపొందిన చిత్రం `అ!`. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం డీసెంట్ విజయాన్ని అందుకుంది.

హీరోయిన్‌పై సీరియస్ అయిన యూనిట్

హీరోయిన్ రష్మిక మందన్నాపై  కోలీవుడ్‌కి చెందిన ఓ చిత్ర యూనిట్ గుర్రుగా ఉందని టాక్. ఎందుకంటే..

తలపై తుపాకులు పెట్టినా జ‌న‌సేనను ఏ పార్టీతో క‌ల‌పం!

జ‌న‌సేన పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీల్లాంటిది కాద‌ని, పేరుకి ప్రాంతీయ పార్టీ అయిన‌ప్పటికీ ప్రతి భార‌త పౌరుడిని సమంగా చూడాల‌న్న ల‌క్ష్యంతో,

వైసీపీ ప్రభుత్వంపై పవన్ ‘గురి’!

సెప్టెంబర్ 7వ తేదీనాటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్నందున ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వ పని తీరు, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ది వంటి విషయాలపై

పెళ్లి చేసుకోబోతున్న కల్యాణ్ రామ్ హీరోయిన్

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన `అభిమన్యు`లో నటించిన హీరోయిన్ రమ్య. తర్వాత తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటించింది.