మే 9న విడుదల కాబోతున్న 'మహానటి'

  • IndiaGlitz, [Sunday,March 18 2018]

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'మ‌హాన‌టి'. వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక ద‌త్ నిర్మాత‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు విడుద‌ల తేదీ ఖరారు చేసుకుంది.

ఉగాది సంద‌ర్భంగా ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న‌ట్టు నిర్మాత తెలిపారు. 1990 మే 9న‌... వైజ‌యంతీ మూవీస్ సంస్థ నుంచి వ‌చ్చిన 'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' టాలీవుడ్ రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ కొత్త చ‌రిత్ర సృష్టించింది. స‌రిగ్గా అదే రోజున 'మ‌హాన‌టి' విడుద‌ల అవుతుండ‌డం విశేషం. టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇది వ‌ర‌కు చూడ‌ని వినోదాన్ని పంచివ్వ‌బోతోంది. మ‌హాన‌టి సావిత్రి క‌థ‌ని వెండి తెర‌పై ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరు.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చిరస్థాయిగా చిలిచిపోయేలా ఉంటుంద‌ని చిత్ర‌బృందం తెలిపింది.

More News

ఏప్రిల్ 6న 'గులేబకావళి'

ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి.

'చిలసౌ' ఫస్ట్ లుక్ విడుదల

సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా

ఏప్రిల్ 6న 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' విడుదల

నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “ఇంతలో ఎన్నెన్ని వింతలో”.హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

రెండు వారాల పాటు 'శ్రీ‌నివాస క‌ళ్యాణం' తొలి షెడ్యూల్‌

నితిన్, రాశి ఖన్నా జంటగా సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’.

గోపీచంద్ 'పంతం' ఫ‌స్ట్‌లుక్ అప్‌డేట్‌

యాక్షన్ హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన గోపీచంద్‌కు ‘జిల్’ (2015) సినిమాతో విజయాలకు బ్రేక్ పడింది.