మ‌హేష్ 25 దీపావ‌ళికి రానుందా?

  • IndiaGlitz, [Friday,December 29 2017]

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ 24వ చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో కైరా అద్వాని కథానాయికగా న‌టిస్తోంది.

శ్రీ‌మంతుడు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత కొర‌టాల‌, మ‌హేష్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే...దీని తర్వాత మహేష్ త‌న‌ 25వ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయ‌నున్న‌ సంగతి తెలిసిందే.

వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. కథానుగుణంగా ఈ మూవీని న్యూయార్క్ లో ఎక్కువ భాగం చిత్రీకరించాల్సి ఉంది. అందుకే చిత్ర బృందం కూడా లొకేషన్స్ వేటలో పడ్డారు. అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని 2018 దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

More News

చిరు పాట‌.. మ‌రోసారి రీమిక్స్‌

మెగాహీరో సాయిధరమ్‌ తేజ్.. ప్రతి సినిమాకి ఒకేలా కష్టపడే హీరో. ఈ యువ క‌థానాయ‌కుడు న‌టించ‌గా ఈ సంవత్సరం విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి.

రెడ్ ఎఫ్ ఎం 'స్ప్రెడ్ ఏ స్మైల్' లో పాల్గొన్న భూమిక, నవదీప్

ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అభిమాన సూపర్ హిట్స్ 93.5 RED FM 'spead a smile' ద్వారా అవసరంలో ఉన్నవారి జీవితాల్లో వెలుగులు పూయించడంలో తన ముఖ్యభూమికని కూడా పోషించింది.

ఎస్ ఎన్ ఆర్ట్స్ వారి 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' పోస్టర్ లాంచ్...

ఎస్ ఎన్ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' హంట్ అనే కార్యక్రమన్ని ఎస్ ఎన్ చిన్నా మరియు శ్రీధర్ లు త్వరలో ఓ ప్రముఖ ఛానెల్ ద్వారా నిర్వహించబోతున్నారు. శివశంకర్ మాస్టర్, ఉదయ భాను, ప్రీతి జింగానియాలు 'జెమ్స్ ది ఇండియన్ టాలెంట్' పోస్టర్ లాంచ్ చేశారు.

శ్రీనివాస రెడ్డి హీరోగా జె.బి.మురళీకృష్ణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ'

'గీతాంజలి','జయమ్ము నిశ్చయమ్మురా' వంటి వైవిధ్యమైన సబ్జెక్టులతో కథానాయకుడిగా

'నీతో ఏదో చెప్పాలని ఉంది' సాంగ్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించనున్న ఆర్.పి.పట్నాయక్

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్...తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయ అక్కర్లేని పేరు. చిత్రం, 'జయం', 'నువ్వు-నేను', 'సంతోషం', 'మనసంతా',  'నువ్వు లేక నేను లేను' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన ఆర్.పి.పట్నాయక్.