వేసవి నుంచి మహేష్ , సందీప్ చిత్రం?

  • IndiaGlitz, [Thursday,February 01 2018]

ఒకే ఒక్క చిన్న సినిమాతో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి' సినిమాతో ఇండస్ట్రీని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు ఈ దర్శకుడు. త‌క్కువ‌ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఇదిలా ఉంటే.. ఈ సంచ‌ల‌న దర్శకుడికి సంబంధించిన ఓ విష‌యం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే...సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారన్న‌దే ఆ క‌థ‌నాల‌ సమాచారం.

ఇటీవల మహేష్‌కి షుగర్ ఫ్యాక్టరీ' అనే ఒక కథను వినిపించారట సందీప్. అది బాగా నచ్చి.. మహేష్ దాన్ని డెవలప్ చేసుకోమని చెప్పారట. మహేష్ 26వ చిత్రంగా ఈ సినిమాని చేయబోతున్నారని ఇన్‌సైడ్‌ సోర్స్ టాక్. ఇదిలా వుంటే...ఈ కథని ముందుగా అర్జున్ రెడ్డి' ఫేం విజయ్ దేవరకొండతో చేయాల‌ని భావించారట సందీప్. కాని ఇప్పుడు మహేష్ ఓకే చెప్పడంతో త‌న ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వచ్చే వేసవి నుంచి చిత్రీకరణ కూడా మొదలు కానుందని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

More News

ప్రతిభావంతుడికి సాయిధరమ్‌ తేజ్‌ సాయం

సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేష్‌ యాదవ్‌ దివ్యాంగుడు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేక పారా అథ్లెట్‌ నరేష్‌ అనేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ నెల 31న ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం చదవి వెంటనే హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్పందించారు.

మార్చి1 నుండి తెలంగాణ, ఏపీ లోని థియేటర్ల మూసివేత

తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి  అధ్య‌క్షులు పి. కిర‌ణ్, సెక్ర‌ట‌రీలు ఎమ్ . రామ‌దాసు, కె. శివ‌ప్ర‌సాద‌రావు, తెలంగాణ రాష్ర్ట ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు కె. ముర‌ళీ మోహ‌న్, సెక్ర‌టరీ సునీల్ నారంగ్ , ద‌క్షిణాది ఫిలిం ఛాంబ‌ర్ అధ్య‌క్షులు ఎల్. సురేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ శ్రీ రవి కొట్ట‌రాక‌ర‌, త‌మిళ సినిమా నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశ

పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లొ 'ఒక్కటే లైఫ్'

సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం 'ఒకటే లైఫ్' .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా  నటిస్తొన్న ఈ చిత్రంలొ సుమన్ ప్రదాన పాత్రలొ కన్పించనున్నారు. త్వరలొ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తక్కువ గ్యాప్ లో వస్తున్న కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్..తెలుగు పరిశ్రమకు వచ్చి పదేళ్ళు పూర్తయ్యింది.

నిత్యా.. రెండు చాలెంజింగ్ రోల్స్

అభినయానికి అవకాశమున్న పాత్రల్లోనే సందడి చేసే కథానాయికల్లో కేరళ కుట్టి నిత్యా మీనన్ ముందుంటుంది.