close
Choose your channels

వేసవి నుంచి మహేష్ , సందీప్ చిత్రం?

Thursday, February 1, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒకే ఒక్క చిన్న సినిమాతో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి` సినిమాతో ఇండస్ట్రీని, ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు ఈ దర్శకుడు. త‌క్కువ‌ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఇదిలా ఉంటే.. ఈ సంచ‌ల‌న దర్శకుడికి సంబంధించిన ఓ విష‌యం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే...సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ డైరెక్టర్ సినిమా చేయబోతున్నారన్న‌దే ఆ క‌థ‌నాల‌ సమాచారం.

ఇటీవల మహేష్‌కి షుగర్ ఫ్యాక్టరీ` అనే ఒక కథను వినిపించారట సందీప్. అది బాగా నచ్చి.. మహేష్ దాన్ని డెవలప్ చేసుకోమని చెప్పారట. మహేష్ 26వ చిత్రంగా ఈ సినిమాని చేయబోతున్నారని ఇన్‌సైడ్‌ సోర్స్ టాక్. ఇదిలా వుంటే...ఈ కథని ముందుగా అర్జున్ రెడ్డి` ఫేం విజయ్ దేవరకొండతో చేయాల‌ని భావించారట సందీప్. కాని ఇప్పుడు మహేష్ ఓకే చెప్పడంతో త‌న ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వచ్చే వేసవి నుంచి చిత్రీకరణ కూడా మొదలు కానుందని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.