close
Choose your channels

'సర్కారువారి పాట' షురూ అయ్యేదప్పుడేనా..!

Monday, October 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సర్కారువారి పాట షురూ అయ్యేదప్పుడేనా..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ఎప్పుడో సెట్స్‌ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా కోవిడ్‌ ప్రభావంతో ఇంకా మొదలే కాలేదు. ఇప్పుడిప్పుడే స్టార్స్‌ అందరూ సినిమా షూటింగ్స్‌ను స్టార్స్‌ చేస్తున్న నేపథ్యంలో 'సర్కారువారి పాట' షూటింగ్‌ను ప్రారంభించడానికి యూనిట్‌ సిద్ధమైంది. మహేశ్ 27వ చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో 40 శాతం చిత్రీక‌ర‌ణను అమెరికాలో చిత్రీక‌రించాల్సి ఉంది. ఇప్పటికే లొకేషన్స్‌కు సంబంధించిన క్లారిటీ కూడా తెచ్చేసుకున్నారట. నవంబర్ నుండి సెట్స్‌పైకి వెళదామనుకుంటే వీసా సమస్యలు వచ్చాయి. ఈ కారణంగా యూనిట్‌ అమెరికా వెళ్లడానికి సమయం పడుతుంది.

అయితే లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు వచ్చే ఏడాది జవనరి మొదటి వారం యు.ఎస్‌లో 'సర్కారువారి పాట' చిత్రీకరణను ప్రారంభించబోతున్నారట. ఈ షెడ్యూల్‌ను 50 రోజుల పాటు ప్లాన్‌ చేశారట మేకర్స్‌. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఇందులో విల‌న్ ఇండియాలోని బ్యాంకుల‌ను మోసం చేసి అమెరికా పారిపోతాడు. అక్క‌డ నుండి విల‌న్‌ను ఇండియా ర‌ప్పించి ప్ర‌తి పైసాను బ్యాంకుకు చెల్లించేలా హీరో మ‌హేశ్ చూస్తాడనేదే కథాంశమని వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.