మహేశ్ స్పెషల్ ట్రైనింగ్...
- IndiaGlitz, [Tuesday,June 25 2019]
సూపర్స్టార్ మహేశ్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడా? అంటే అవుననే ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎందుకనే వివరాల్లోకి వెళితే.. మహేశ్ తన 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' జూలై మొదటి వారంలో కాశ్మీర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. రెండు వారాల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ను చిత్రీకరించనున్నారట.
ఈ యాక్షన్ సీన్స్ కోసం ఇటలీ నుండి ఓ స్పెషల్ టీమ్ను రప్పించారట. ఈ టీమ్ శిక్షణలో మహేశ్ వారం పాటు శిక్షణ తీసుకుంటున్నారట. శిక్షణ తర్వాత కాశ్మీర్ వెళతారట. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.