close
Choose your channels

బీజేపీలో చేరిన అంబికా షాకింగ్ కామెంట్స్...

Tuesday, June 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీజేపీలో చేరిన అంబికా షాకింగ్ కామెంట్స్...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఏపీలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇప్పటికే పలువురు ఎంపీలు, కీలక నేతలు జంప్ అయిన విషయం విదితమే. సోమవారం నాడు టీడీపీకి చెందిన కీలకనేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త అంబికా కృష్ణ.. బీజేపీ తీర్థం పుచుకున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీ వేదికగా బీజేపీ కీలకనేత రామ్ మాధవ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

నాకు నచ్చలేదు..!

"నేనేమీ టీడీపీకి ద్రోహం చేయలేదు. ఎంతో కష్టపడి పనిచేస్తే టీడీపీనే నాకు నమ్మకద్రోహం చేసింది. ఓ దశలో చంద్రబాబుబీజేపీ మీద చేసిన పోరాటాలు నాకు నచ్చలేదు. ప్రధాని మోదీ నాయకత్వ లక్షణాలు నచ్చడంతో బీజేపీలో చేరాను. త్వరలోనే మరికొందరు నేతలు బీజేపీలో చేరుతున్నారు" అని అంబికా చెప్పుకొచ్చారు. కాగా.. బీజేపీలో చేరిన అంబికా కృష్ణను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించిన బీజేపీ పెద్దలు అభినందించారు. కాగా టీడీపీ ప్రభుత్వం హయాంలో అంబికా కృష్ణ ఏపీఎఫ్డీసీ చైర్మన్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

త్వరలోనే మరికొందరు టీడీపీ నేతలు బీజేపీ కండువాలు కప్పుకుంటారని అంబికా.. బాంబ్ పేల్చారు. కాగా బీజేపీలోకి ఎంపీలు జంప్ అయిన నాటి నుంచి 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం విదితమే. అయితే తాజాగా అంబికా చేసిన వ్యాఖ్యలు మరోసారి టీడీపీని కలవరపెడుతున్నాయి. అయితే అంబికా మాత్రం బీజేపీలోకి వచ్చే నేతల పేర్లు మాత్రం బయటపెట్టడానికి సాహసించలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.