ఫ్యాన్స్ వల్ల క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి

  • IndiaGlitz, [Monday,August 12 2019]

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తన ఫ్యాన్స్ చేసిన పనికి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళ్తే.. గత ఏడాది మమ్ముట్టి 'పేరన్బు' అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి 66వ జాతీయ అవార్డు ఇవ్వలేదని మమ్ముట్టి ఫ్యాన్స్ జాతీయ అవార్డ్ కమిటీ చైర్మన్ రాహుల్‌పై సోషల్ మీడియాలో దూషణకు దిగారు. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్న రాహుల్ ఏకంగా మమ్ముట్టికి ఫ్యాన్స్ చర్యల గురించి చెబుతూ మెసేజ్ చేశాడు.

అంతే కాకుండా జ్యూరి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, ప్రాంతీయ బోర్డు రిజెక్ట్ చేసిన సినిమా జాతీయ అవార్డుల పరిశీలనకే రాలేదని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దీనిపై మమ్ముట్టి వెంటనే రియాక్ట్ అయ్యారు. 'సారీ సర్!..నాకు ఈ విషయాలు తెలియవు. అయినా జరిగిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను' అంటూ రిప్లై ఇచ్చారు.

More News

బిగ్‌బాస్ నుండి తమన్నా ఔట్

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3 మూడోవారం ఎలిమినేషన్ ముగిసింది.

ట్విట్టర్‌ని వదిలేసిన బాలీవుడ్ దర్శకుడు .. కారణమేంటో తెలుసా?

సామాజిక సమస్యలపై సినిమాలు తీసే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ట్విట్టర్ మాధ్యమం నుండి బయటకు వచ్చేశారు.

కె.విశ్వనాథ్‌ని కలిసి సీఎం కె.సి.ఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.. సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలుస్తున్నారు` అనే వార్త బయటకు రాగానే కె.విశ్వనాథ్‌కి ఏమైంది?

వాళ్ళకు నా వంతు సాయం చేస్తా!- హీరో చిరంజీవి

“సంగీతమంటే నాకు ప్రాణం. సంగీతం లేనిదే నేను లేను. అప్పటి చక్రవర్తి, ఇళయరాజా నుంచి రాజ్ కోటి, ఇప్పటి మణిశర్మ దాకా ఎంతోమంది సంగీత దర్శకుల బాణీలు

`రాక్షసుడు` చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ - కోనేరు సత్యనారాయణ

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం `రాక్షసుడు`.