మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేసిన మంచు మ‌నోజ్‌

  • IndiaGlitz, [Thursday,February 13 2020]

మంచు మోహ‌న్‌బాబు న‌ట వార‌సులుగా కెరీర్ స్టార్ట్ చేసిన వారు ల‌క్ష్మీ, విష్ణు, మ‌నోజ్‌. వీరిలో మంచు మ‌నోజ్ సినిమా రంగానికి మూడేళ్లుగా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈరోజు ఆయ‌న త‌న కొత్త సినిమాను అధికారికంగా అనౌన్స్ చేస్తూ వ‌చ్చారు. ఈ సినిమాతో హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా మారారు మంచు మ‌నోజ్‌. కొన్ని రోజుల క్రితమే తాను నిర్మాత‌గా మారుతున్నాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎం ఎం ఆర్ట్స్ అనే బ్యాన‌ర్‌ను కూడా అనౌన్స్ చేశారు మ‌నోజ్‌. అయితే ఆ సంర‌ద్భంలో త‌న కొత్త సినిమా విశేషాలేవీ చెప్ప‌లేదు.

అయితే మూడేళ్ల విరామానికి బ్రేక్ చెబుతూ మ‌నోజ్ 'అహం బ్ర‌హ్మాస్మి' అనే సినిమా చేయ‌బోతునట్లు ప్ర‌క‌టించారు. విద్యానిర్వాణ‌, మంచు ఆనంద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా త‌ల్లి నిర్మ‌లా దేవితో క‌లిసి సినిమాను నిర్మించ‌బోతునట్లు మంచు మ‌నోజ్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. టైటిల్ విన‌డానికి ఆధ్యాత్మికంగా ఉంది. మ‌రి కాన్సెప్ట్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి. సినిమాను మార్చి 6న అధికారికంగా ప్రారంభించ‌నున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల చేయ‌డానికి మ‌నోజ్ స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది.

More News

మ‌రోసారి అలాంటి పాత్ర చేయ‌బోతున్న‌ బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత మ‌రో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

సందీప్ కిష‌న్ 'A1 ఎక్స్‌ప్రెస్‌' రిలీజ్ డేట్

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. '

'ఆరుద్ర' సెన్సార్‌ పూర్తి, త్వరలో విడుదల

తమిళంలో రచయితగానే కాకుండా నటుడిగా, దర్శకనిర్మాతగా పా.విజయ్ కు మంచి పేరుంది. ఆయన ప్రధాన పాత్రలో

'శివ 143' ఫిబ్రవరి14న విడుదల

ఇందుకు గాను ఉప్పల్ సినీ పోలీస్ మాల్ లో ఘనం గా జరిగిన ప్రీ రేలీజ్ వేడుకలలో

ప్రేమికుల రోజున 'లవ్ స్టోరి' మ్యూజికల్ ప్రివ్యూ

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ  ‘‘లవ్ స్టోరీ’’.సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో