మణిరత్నం.. ఫ్యామిలీ మూవీ

  • IndiaGlitz, [Saturday,November 18 2017]

ప్రాంతీయ చిత్రాల‌తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. త‌మిళంలో ఆయ‌న రూపొందించిన ప‌లు చిత్రాలు తెలుగులోనూ మంచి విజ‌యం సాధించాయి. కాగా, ప్ర‌స్తుతం ఆయ‌న ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. ఇది ఒక ఫ్యామిలీ ఒరియెంటెడ్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్కుతోంద‌ని. ఇందులో ప్ర‌కాష్ రాజ్‌, జ‌య‌సుధ జంట‌గా న‌టిస్తుంటే.. అర‌వింద్ స్వామి, శింబు, ఫాహ‌ద్ ఫాజిల్ వారి కొడుకులుగా న‌టిస్తున్నారు. జ్యోతిక‌, ఐశ్వ‌ర్యారాజేష్ క‌థ‌కు కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నార‌ని తెలిసింది. ఇక విజ‌య్ సేతుప‌తి ఓ పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్ గా సంద‌డి చేయ‌నున్నారు.

25 ఏళ్లుగా మ‌ణిర‌త్నం అన్ని సినిమాల‌కు సంగీత‌మందించిన ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ సినిమాకి స్వ‌రాలు అందించ‌నున్నారు. ప్ర‌ముఖ ఛాయాగ్రాహ‌కుడు సంతోష్ శివ‌న్ కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న ఈ చిత్రానికి శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

జ‌న‌వ‌రిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

More News

వ్యాపార భాగస్వామిపై నాగసుశీల పిర్యాదు

అక్కినేని నాగేశ్వరరావు తనయ, నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామి అయిన చింతలపూడి శ్రీనివాస్పై ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే..దాదాపు పన్నెండేళ్లుగా వ్యాపారం భాగస్వామ్యులుగా ఉన్నారు.

జాన్వి సినిమాలో శ్రీ‌దేవి?

ఒకప్పటి అందాల తార శ్రీదేవి చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. గ్యాప్ వచ్చినంత మాత్రానా తనలో నటనాప్రతిభ ఏం మాత్రం తగ్గలేదని ఈ మధ్య వచ్చిన ఆమె సినిమాలు చెప్పాయి.

మ‌ళ్లీ ట‌చ్ చేస్తున్న కొర‌టాల‌

మాన‌వ సంబంధాల‌తో పాటు సామాజిక అంశాలను కూడా టచ్ చేస్తూ ద‌ర్శ‌కుడు కొరటాల శివ సినిమాలు తెర‌కెక్కిస్తుంటారు.  తన మొద‌టి సినిమా 'మిర్చి'లో మనుష్యుల మధ్య ప్రేమానురాగాలను ప్రస్తావించిన శివ‌.. త‌న రెండో చిత్రం 'శ్రీమంతుడు'లో గ్రామాన్ని దత్తత తీసుకుని.. ఉన్నవాడు కొంచెం ఇస్తే లేని వాడే ఉండడు అనే అంశాన్ని అందరికి అర్ధమయ్యేలా చెప్పాడు.

మోహ‌న్‌లాల్‌తో వెంక‌టేష్‌?

కంటెంట్ న‌చ్చితే చాలు.. జయాపజయాలను, స్టార్ డమ్‌ని కూడా పట్టించుకోని క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్. స‌బ్జెక్ట్ డిమాండ్ చేస్తే.. మల్టీ స్టారర్ మూవీ చేయడానికి కూడా వెనకాడరాయ‌న‌.

రాజ్‌త‌రుణ్‌ని న‌మ్మిన నాగార్జున‌

టాలీవుడ్‌లో తక్కువ టైంలోనే మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్. అలాగే తనకంటూ అభిమానులను కూడా సంపాదించుకున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. కాగా, రాజ్ త‌రుణ్  నటించిన 'రాజుగాడు', 'రంగుల రాట్నం' చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.