తూర్పుగోదావరి జిల్లాలో పవన్, చిరు టూర్.. ఫ్యాన్స్‌కు పండగే..!!

తూర్పుగోదావరి జిల్లాలో మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. తొలుత శుక్రవారం రాజమండ్రికి రానున్నారు చిరంజీవి. శనివారం పవన్ పర్యట వుంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపడుతుండగా, అభిమానులు గ్రాండ్‌ వెల్‌కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో జరిగే పలు కార్యక్రమాల్లో మెగాస్టార్ పాల్గొంటారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కళాశాల ఆవరణలో విగ్రహావిష్కరణ చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఘనస్వాగతం చెప్పేందుకు అభిమానులు భారీగా తరలిరానున్నారు.

మరోవైపు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధినేత, పవన్ కల్యాణ్. అక్టోబర్ రెండో తేదీన రాజమండ్రిలో పవన్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన నాయకులు. రోడ్ల శ్రమధానంలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్‌కు రానున్నారు జనసేనాని. రోడ్ల దుస్థితి పరిశీలించి శ్రమదానం చేయనున్నారు పవన్‌. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే జనసేన నాయకులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అటు పవన్ శ్రమదానం నేపథ్యంలో జనసైనికులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అయితే పవన్ శ్రమదానం కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై జనసేనాని రియాక్షన్ ఎలా వుంటుందో తెలియాల్సి వుంది.

More News

బిగ్‌బాస్ 5లో ‘‘ ఆకలి రాజ్యం ’’... కెప్టెన్సీ కోసం కడుపు మాడ్చుకున్న కంటెస్టెంట్స్ , రేసులో ఆ ముగ్గురు

కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ను గెలిచేందుకు కంటెస్టెంట్స్ కుస్తీ  పెట్టారు. దీని వల్ల ఇంటి సభ్యులకు ఫుడ్ విలువ తెలిసొచ్చింది.

చిత్రసీమలో మళ్లీ డ్రగ్స్ కలకలం... మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డ 'సింగం' నటుడు

డ్రగ్స్.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్‌వుడ్ చిత్ర పరిశ్రమలను ఎంతగా కుదిపేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసింది ఈడీ.

కుక్క మొరిగింది... పట్టించుకోవచ్చు: ‘‘ బాలయ్య ’’ ఫోటోతో పోసానికి నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

అటు ఏపీ మంత్రులు, వైసీపీ నేతు, పోసాని కృష్ణ మురళి తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌పై చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

పవన్‌‌‌ను తిడతారా.. 2024లో అనుభవిస్తారు: జగన్‌కు కాపు సంక్షేమ సేన హెచ్చరిక

‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్నాయి.

‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్

అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో