టీడీపీ నేతలపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

మంత్రి కొడాలి నాని టీడీపీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో భూములకు రేటు పడిపోయిందని..రైతులను అడ్డుపెట్టుకుని గోతికాడ నక్కలా బతుకుతున్నారంటూ ధ్వజమెత్తారు. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని అడిగినందుకు బషీర్‌బాగ్‌లో.. రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబుదని విమర్శించారు.
రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమ కూడా వేసుకోవడం కాదని.. బషీర్‌బాగ్‌ ఘటనలా మీరూ కాల్చుకుంటే బాగుంటుందని కొడాలి నాని సూచించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లాంటి వేస్ట్‌ మనిషిని తాము ఎక్కడా చూడలేదన్నారు. వరి చేనుకి, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి లోకేష్ అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కనీస ఇంగిత జ్జానం లేని వ్యక్తి నారా లోకేష్ అని.. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్థుడని తీవ్ర స్థాయిలో విమర్శించారు. లోకేష్‌కు ఇప్పటికే కొవ్వు కరిగిందని కళ్లు నెత్తిమీద ఉన్నాయని.. అవి కూడా కిందకు దించుతామన్నారు. కరోనా భయంతో చంద్రబాబు ఇంట్లో కూర్చున్నాడని ఎద్దేవా చేశారు.

More News

ఈసారి కూడా ట్రంపే గెలుస్తారట...

నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదే ఆసక్తికర విషయం.

ఫైనల్‌గా షాక్ ఇచ్చిన పునర్నవి..

బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ నటి పునర్నవి భూపాలం.. గత మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా నడుపుతున్న హైడ్రామాకు నేటితో ఫుల్ స్టాప్ పెట్టింది.

పవర్ స్టార్ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

'శ్రీదేవి సోడా సెంట‌ర్' టైటిల్, ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల

భ‌లే మంచి రోజు, ఆనందో బ్రహ్మా, యాత్ర వంటి సూపర్ హిట్స్ సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించిన 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్

'లక్ష్మీబాంబ్‌' టైటిల్‌ మార్పు

న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత అయిన రాఘవ లారెన్స్ ఇప్పుడు బాలీవుడ్‌ డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌ను న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `కాంచ‌న`