‘వేదాళం’ సినిమాకు ముహూర్తం కుదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య‌’ సినిమా పూర్తి కానేలేదు . కానీ.. త‌దుప‌రి రెండు సినిమాల‌ను ఆయ‌న లైన్‌లో పెట్టారు. ఈ రెండు సినిమాలు రీమేక్ సినిమాలే కావ‌డం విశేషం. మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్‌’, త‌మిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌ల‌లో చిరంజీవి న‌టించ‌నున్నారు. ‘ఆచార్య‌’ త‌ర్వాత ఈ రెండు సినిమాలు సెట్స్‌పైకి వెళ్ల‌నున్నాయి. వీటిలో ‘లూసిఫర్’ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేయనుండగా, ‘వేదాళం’ రీమేక్‌ను మెహ‌ర్‌ర‌మేశ్ డైరెక్ట్ చేయ‌నున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే ‘వేదాళం’ సినిమాను అక్టోబ‌ర్ 20న లాంఛనంగా ప్రారంభించ‌నున్నార‌ట‌.

స్టార్స్ అందరూ వారి సినిమాలను సెట్స్ పైకి తీసుకెళుతున్న నేపథ్యంలో ‘ఆచార్య‌’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు స‌మాచారం. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాతే షూటింగ్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

More News

ఇంటికి చేరుకున్న తమన్నా...

తమన్నా ఇంటికి చేరుకోవడమేంటి? అనే సందేహం కలుగక మానదు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో

సాయితేజ్ బర్త్‌డే సందర్భంగా చిరు ఆసక్తికర ట్వీట్..

సుప్రీం హీరో సాయితేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

అవినాష్ మాస్క్‌ని తొలగిస్తున్నాడా?

నిన్నటి అమితుమీ టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయ్యింది. బిగ్‌బాస్ డీల్ ఇస్తారు.

మంత్రి వెల్లంపల్లికి మళ్లీ అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు..

దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నట్టే కోలుకుని తిరిగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

`బ్లాక్డ్` మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

మ‌నోజి నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో