Devi Sri Prasad: బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్... చిరంజీవి ఇంటికి దేవిశ్రీ ఎందుకెళ్లినట్లు..?

  • IndiaGlitz, [Monday,April 24 2023]

దేవి శ్రీ ప్రసాద్.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌. కొత్తగా ఎంతమంది వస్తున్నా.. ఇప్పటికీ టాప్ ప్లేస్ ఆయనదే. దాదాపు పాతికేళ్లుగా చిత్ర సీమకు సేవ చేస్తున్న దేవికి ఇప్పటికీ యువతలో అదే క్రేజ్ వుందంటే దానికి ఆయన చేసిన సినిమాలు, అందించిన స్వరాలే కారణం. ముఖ్యంగా ఫుల్ ఎనర్జీతో వుండే దేవిశ్రీ ప్రసాద్ తను వున్న ప్రాంతాన్ని జోష్‌తో నింపేస్తారు. ఇకపోతే.. డీఎస్పీకి మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం. తన తండ్రి సత్యమూర్తి కాలం నుంచే మెగా ఫ్యామిలీతో ఆయనకు అనుబంధం వుంది. ఆ అభిమానంతోనే చిరంజీవి సినిమాలకు అదిరిపోయే బీట్స్ అందించారు దేవి. మెగాస్టార్‌పై తనకున్న అభిమానాన్ని పలు వేదికలపై ప్రస్తావిస్తూనే వుంటారు.

ఇదిలావుండగా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిశారు దేవిశ్రీ ప్రసాద్. అంతేకాదు.. తన అభిమాన నటుడితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేశానని.. ఆయనను కలిసిన ప్రతీసారీ చాలా ప్రత్యేకంగా ఫీలవుతానని దేవిశ్రీ అన్నారు. బాస్‌తో వున్న తనను ఫోటో తీసినందుకు చిరంజీవి కుమార్తె సుస్మితకు థ్యాంక్స్ చెప్పారు దేవి. అయితే వీరిద్దరూ ఎందుకు కలుసుకున్నారనే దానిపై ఫిలింనగర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇక దేవిశ్రీ చివరిసారిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాకు స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్‌లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్.. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2కి సంగీతం అందిస్తున్నారు. ఇవి రెండు క్రేజీ కాంబినేషన్‌లు కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడోనని మ్యూజిక్ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

More News

నాకు, నా కుటుంబానికి ప్రాణహానీ వుంది.. పోలీసులకు సింగర్ సునీత భర్త రామ్ ఫిర్యాదు

తనకు, తన కుటుంబానికి ఓ వ్యక్తి నుంచి ప్రాణహానీ వుందంటూ ప్రముఖ నేపథ్య గాయనీ సునీత భర్త రామ్ వీరపనేని పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్

Rahul Gandhi: ఎంపీగా అనర్హత వేటు.. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్, లగేజ్ తీసుకుని ఎక్కడికి వెళ్లారంటే..?

లోక్‌సభ సభ్యుడిగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రభుత్వం తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లో వుంటున్న

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు : చీఫ్ గెస్ట్‌గా రజనీకాంత్... ఒకే వేదికపై తలైవా, చంద్రబాబు, బాలయ్య

పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు

శరత్‌బాబుకు అస్వస్థత.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలింపు, లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

సీనియర్ నటుడు శరత్ బాబు కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఆరోగ్యం కాస్త సీరియస్‌గా వుండటంతో బెంగళూరు

Samantha :సిటాడెల్ ప్రీమియర్ షోలో మెరిసిన సమంత.. ఆమె ధరించిన స్నేక్ నెక్లెస్, బ్రాస్లెట్ ఎన్ని కోట్లో తెలుసా..?

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో వున్న టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు.