చిరు మైత్రీతో చేస్తాడా?

  • IndiaGlitz, [Tuesday,November 05 2019]

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత 'ఖైదీ నంబ‌ర్ 150', 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించాడు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 152 సినిమాను చే్స్తున్నాడు. కాగా.. ప్ర‌స్తుతం తెలుగు చిత్రసీమ‌లో పెద్ద నిర్మాణ సంస్థ‌లో ఒక‌టి చెప్పుకుంటున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా చేయాల‌నుకుంటుంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి కూడా సుకుమార్‌ను బ్లాక్ చేసింద‌ట‌. స‌రైన స్టార్ హీరో కోసం ఎదురు చూస్తున్న త‌రుణంలో వీరి కంట మెగాస్టార్ చిరంజీవి కంట‌ప‌డ్డాడు.

ఇది వ‌ర‌కు చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తో రంగ‌స్థ‌లం వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు ఆ స‌మ‌యంలో ఏర్ప‌డిన స్నేహ బంధంతో రామ్‌చ‌ర‌ణ్‌ను స‌పోర్ట్ తీసుకుని చిరుతో సినిమా చేయాల‌నుకుంటుంది. బ‌న్నితో సుకుమార్ పూర్తి చేయ‌గానే చిరంజీవి సినిమాను ట్రాక్ ఎక్కించాల‌నుకుంటుంది. ఈలోపు చిరంజీవి ఎలాగూ కొర‌టాల సినిమాను పూర్తిచేసేస్తాడు కాబ‌ట్టి మైత్రీ చిరుతో గ్రీన్ సిగ్న‌ల్ తీసుకోవాల‌నుకుంటుంది. ఎలాగూ రంగ‌స్థ‌లం సినిమా మేకింగ్ విష‌యంలో చిరు హ్యాపీగా ఉండ‌టంతో వీరి ప్ర‌య‌త్నానికి స‌మ‌స్య ఉండ‌క‌పోచ్చు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు ముందుకెళుతుందో చూడాలి.

More News

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌... ద‌ర్శ‌కుల‌కు కోర్టు నోటీసులు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణాంత‌రం .. ఆమెపై రెండు, మూడు బ‌యోపిక్స్‌ను ద‌ర్శక నిర్మాతు అనౌన్స్ చేశారు.

మహేష్ బాబుకు బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.

‘కలాం’ స్థానంలో ‘వైఎస్’ పేరు.. సీఎం జగన్ సీరియస్!

మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత డా. అబ్దుల్ కలాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోర అవమానం చేసిందని గత కొన్ని గంటలుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

వి. వి. వినాయక్ చేతులు మీదుగా 'రాజా నరసింహ' ట్రైలర్ ఆవిష్కరణ

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముటీ కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా అనువాదమవుతోంది.

అజర్‌బైజాన్‌లో '90 ఎంఎల్‌' పాటల చిత్రీకరణ పూర్తి...

'ఆర్‌ఎక్స్100' ఫేమ్‌ కార్తికేయ నటిస్తోన్న మరో విభిన్న చిత్రం '90 ఎం.ఎల్‌'. శేఖర్‌ రెడ్డి ఎర్ర దర్శకునిగా పరిచయమవుతున్నారు.