నాలాగా పోరాటం చేస్తున్న ఎంతో మంది విజ‌య‌మే ఈ ప‌ద్మ‌శ్రీ అవార్డ్ - సునీతా కృష్ణ‌న్ (నా బంగారు తల్లి - ప్రొడ్యూసర్)

  • IndiaGlitz, [Tuesday,April 12 2016]

మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణ పై అలుపెర‌గ‌ని పోరాటం చేసిన సునీతా కృష్ణ‌న్ కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ద‌క్కింది. ఈరోజు రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డ్ అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సునీత కృష్ణ‌న్ మాట్లాడుతూ..ఈ అవార్డ్ నాకు వ‌చ్చింది కాదు..నా పోరాటానికి వ‌చ్చింది అని భావిస్తున్నాను. నాలాగా పోరాటం చేస్తున్న ఎంతో మంది విజయ‌మే ఆ అవార్డ్ అనుకుంటున్నాను. నేను ఇర‌వై సంవ‌త్స‌రాల నుంచి ఈ పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటాన్ని గుర్తించిన ప్ర‌భుత్వానికి థ్యాంక్స్ చెప్ప‌ను కానీ నాలా పోరాటం చేస్తున్న వారంద‌రికీ ఇది పెద్ద విజ‌యం అనుకుంటాను. స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం గుర్తించ‌డం పెద్ద విజ‌యం. నా వ‌ల్ల‌ పెద్ద మార్పు రాదు. ప్ర‌భుత్వ యంత్రాంగం కూడా క‌దిలి వ‌స్తే అప్పుడు మార్పు వ‌స్తుంది. ప్ర‌భుత్వం బాధితురాల‌కు స‌పోర్ట్ ఇవ్వాలి. నేర‌స్థుల‌కు వార్నింగ్ ఇవ్వాలి. నేర‌స్థులు..ఏమైనా చెయ్య‌చ్చు. ఎవ‌రు ఏమీ చేయ‌లేరు అనుకుంటున్నారు.

మ‌న పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం ఆడ‌దాన్ని అమ్మ‌డం అంటే భ‌రించం అని క‌ఠిన‌ నిర్ణ‌యం తీసుకోవాలి. ఇప్పుడు మేము చేస్తున్న ప‌ని ఒంట‌రిగా చేస్తున్నాం. ఇలాంటి సంఘ‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండే రోజు వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌భుత్వం దీనిపై సీరియ‌స్ గా వ‌ర్క్ చేయాలి. స‌మాజంలో మార్పు రావాలంటే ముందు ప్ర‌తి ఒక్క‌రు మారాలి. మ‌న పిల్ల‌ల‌కి ముఖ్యంగా అబ్బాయిల‌కు స్త్రీ లను గౌర‌వించాలి అని చెప్పాలి. అలా చేస్తే ఈ స‌మాజం సేవ్ వ‌ర‌ల్డ్ అవుతుంది. కొన్నిచోట్ల మ‌హిళ‌లు ఆల‌యాల్లో ప్ర‌వేశించ‌డం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాల‌కు సెల్యూట్ చేస్తున్నాను. ఎంతో మంది మ‌హిళ‌లు బానిస‌త్వంలో బ‌తుకుతున్నారు. వాళ్ల‌ని ర‌క్షించ‌డ‌మే నాకు ముఖ్యం. మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణ‌ను అడ్డుకునేందుకు ఈ పోరాటాన్ని కొన‌సాగిస్తాన‌న్నారు.

More News

వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల మూవీ ముహుర్తం..

మెగా హీరో వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపొందనున్న‌ద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ జాత‌కం చెప్పిన సూర్య‌..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు.

టర్కీ లో చైతు..

నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం సాహసం శ్వాస గా సాగిపో.

బ‌న్ని - విక్ర‌మ్ కాంబో మూవీ డీటైల్స్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (బ‌న్ని), విక్ర‌మ్ కుమార్ క‌ల‌సి ఓ సినిమా చేయ‌నున్నారు. ఇష్క్, మ‌నం చిత్రాల త‌ర్వాత విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన 24 మూవీ మే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఆ సినిమా కంటే ఎక్కువ ఎంట‌ర్ టైన్మెంట్ మా సినిమాలో ఉంటుంది - హీరో రాజ్ త‌రుణ్‌

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్...ఈ మూడు చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించి అటు ఆడియోన్స్, ఇటు ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. తాజాగా రాజ్ త‌రుణ్ - విష్ణుతో క‌ల‌సి న‌టించిన చిత్రం ఈడోర‌కం ఆడోర‌కం. జి.నాగేశ్వ‌రరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో  అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించారు.