పవన్ సినీ రీ ఎంట్రీపై నాదెండ్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా పూర్తి చేసిన త‌ర్వాత జ‌న‌సేన పార్టీతో పూర్తిగా రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయ్యారు. అయితే ఎన్నిక‌లు త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి రంగ ప్ర‌వేశం చేశారు. అస‌లు ప‌వ‌న్‌క‌ల్యాన్ సినీ రంగ పునః ప్ర‌వేశంపై ఆయ‌న స‌న్నిహితులు లెవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాఖ్య‌లు చేయ‌లేదు. తొలిసారి జ‌న‌సేన పార్టీ నేత‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అత్యంత స‌న్నిహితుడైన నాదెండ్ల మ‌నోహర్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రోద్భ‌లంతోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినీ రంగ ప్ర‌వేశం చేశార‌ని నాదెండ్ల మ‌నోహ‌ర్ తెలియ‌జేశారు. చిరంజీవి.. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను మ‌ళ్లీ సినీ రంగ ప్రేశం చేసి సినిమాలు చేయాల‌ని కోర‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినీ రంగ ప్ర‌వేశం చేశార‌ని నాదెండ్ల పేర్కొన్నారు. ఇప్పుడు నాదెండ్ల వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

సినీ రంగంలోకి పునః ప్ర‌వేశం చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్నారు. ఒక‌వైపు సినిమాల్లో న‌టిస్తూనే, మ‌రో వైపు రాజ‌కీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇలా రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారు జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై చిరంజీవి మౌనంగా ఉంటారా? లేక ఏమైనా స్పందిస్తారా? అనేది చూడాలి.

More News

ఢిల్లీ ఘటనపై కేంద్రం సీరియస్...

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన విధ్వంస ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది.

ప్రకాశం: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వైద్యురాలి పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ వికటించింది. ఆ వ్యాక్సిన్ వేయించుకున్న ధనలక్ష్మి అనే యువ డాక్టర్ పరిస్థితి విషమంగా మారింది.

‘ఆచార్య’కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఐయామ్ శివ.. నా గొంతులో హాలాహలం ఉంది: పద్మజ

మదనపల్లె అక్కా చెల్లెళ్ల కేసులో నిందితురాలు పద్మజ క్షణానికో విధంగా ప్రవర్తిస్తున్నారు. తన భర్తను భర్తే కాదంటూ హడలెత్తిస్తున్నారు.

ఆస్కార్‌కు నామినేట్ అయిన 'ఆకాశం నీ హద్దురా'!

సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ ఆత్మకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.