'సవ్యసాచి' పాయింట్ అదేన‌ట‌

  • IndiaGlitz, [Tuesday,March 20 2018]

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సవ్యసాచి'. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా న‌టిస్తోంది. తమిళ నటుడు మాధవన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. చైతు అక్క పాత్రలో భూమిక చావ్లా నటిస్తున్నారు.

సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. సోదరికి జరిగిన అన్యాయానికి తమ్ముడు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ప్రధాన అంశమని.. సినిమాకి ఇదే ప్రధాన ఆకర్షణ అని నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో పాటు దర్శకుడు.. రావు రమేష్ పాత్రను మలచిన తీరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అలాగే స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం.. ఆడియో ప‌రంగా మెప్పించేలా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, జూన్ 15న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

More News

 ప్రభుదేవా గులేబకావళి గీతావిష్కరణ

ప్రభుదేవా, హన్సిక హీరో హీరోయిన్లుగా  నటించిన తమిళ  చిత్రం గులేబకావళి. కళ్యాణ్ దర్శకత్వం వహించారు. రేవతి ప్రధాన పాత్రను పోషించారు.

ఐక్యరాజ్య సమితి నుంచి అరుదైన గౌరవం అందుకొన్న నరేష్ !!

ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ డిప్లమాటిక్ రిలేషన్స్, హ్యూమన్ రైట్స్ & పీస్, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు.

ప్ర‌భాస్ సినిమా గురించి పూజా ఏమందంటే..

వరుసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూ క‌డుతుండ‌డంతో.. ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది  అందాల తార పూజా హెగ్డే.

'ఆనందం' పాట‌ల‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్!

అన్నం ఉడికిందా అని చూడ్డానికి ఒక మెతుకు ప‌ట్టుకుంటే చాల‌ని అంటారు. అలాగే సినిమా ఎలా ఉండబోతుందో చెప్ప‌డానికి పాట‌ల‌కు వ‌స్తున్న స్పంద‌న చూస్తే చాలు.

యు.కె. నేప‌థ్యంలో వ‌రుణ్ చిత్రం

‘ఫిదా’, ‘తొలిప్రేమ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.