close
Choose your channels

'సవ్యసాచి' పాయింట్ అదేన‌ట‌

Tuesday, March 20, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సవ్యసాచి పాయింట్ అదేన‌ట‌

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సవ్యసాచి'. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా న‌టిస్తోంది. తమిళ నటుడు మాధవన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. చైతు అక్క పాత్రలో భూమిక చావ్లా నటిస్తున్నారు.

సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. సోదరికి జరిగిన అన్యాయానికి తమ్ముడు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ప్రధాన అంశమని.. సినిమాకి ఇదే ప్రధాన ఆకర్షణ అని నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో పాటు దర్శకుడు.. రావు రమేష్ పాత్రను మలచిన తీరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అలాగే స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం.. ఆడియో ప‌రంగా మెప్పించేలా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, జూన్ 15న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.