పాటల చిత్రీకరణలో 'నక్షత్రం'

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.

'నక్షత్రం' టాకీ పార్ట్ పూర్తయింది. నేటి నుంచి ఈ చిత్రానికి సంబంధించి పాటల చిత్రీకరణ 'బ్యాం కాక్' లో ప్రారంభమవుతుంది. సందీప్ కిషన్,రెజీనా ల పై ఒక పాట, సాయిధరమ్ తేజ్,ప్రగ్య జైస్వాల్ ల పై ఒక పాట ను చిత్రీకరిస్తారు. అలాగే ఒక ప్రత్యేక గీతాన్ని కూడా చిత్రీకరించ నున్నట్లు దాని వివరాలు బ్యాం కాక్' నుంచి రాగానే ప్రకటించనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఏప్రిల్ లో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్య క్రమాలు జరుగుతున్నాయి.

'పోలీస్ 'అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం'. రామాయణం లో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత ను కలిగి ఉంటుందో.. సమాజం లో 'పోలీస్' పాత్ర అలాంటిది. అలాంటి పాత్రను ఈ 'నక్షత్రం' లో ఎలా చూపించబోతున్నామన్నది వెండితెరపైనే చూడాలన్నారు దర్శకుడు కృష్ణ వంశీ.

సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్, రెజీనా,ప్రగ్య జైస్వాల్,తులసి,జె.డి.చక్రవర్తి,ప్రకాష్ రాజ్,శివాజీరాజా, రఘుబాబు,తనీష్,ముఖ్తర్ ఖాన్,సాయికిరణ్, ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మాటలు: తోట ప్రసాద్,పద్మశ్రీ,కిరణ్ తటవర్తి, సంగీతం: భీమ్స్, భారత్, పాటలు: అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, కెమెర:శ్రీకాంత్ నారోజ్, ఎడిటర్: శివ.వై.ప్రసాద్, కొరియోగ్రఫీ: గణేష్,స్వామి; పోరాటాలు:జాషువా మాస్టర్,జాలి బాస్టియన్,శ్రీధర్; ఆర్ట్: పురుషోత్తం, పబ్లిసిటీ: ఓంకార్ కడియం, స్టిల్స్: మల్లిక్ ని ర్మాతలు:ఎస్.వేణుగోపాల్,సజ్జు,కె.శ్రీనివాసులు కధ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం; కృష్ణవంశీ

More News

ట్రెండ్ క్రియేట్ చేస్తున్న బన్ని....

రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`,`సరైనోడు`వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్

మహేష్ మూవీ రిలీజ్ డేట్...

సూపర్ స్టార్ మహేష్ బాబుహీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్,ఠాగూర్ మధులు భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న

ప్రముఖ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూత

తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత కె.సి.శేఖర్ బాబు

బాలీవుడ్ ఆలోచన ఉందంటున్న బాహుబలి...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వం లో బాలకృష్ణ 101 వ చిత్రం

శతచిత్ర కథానాయకుడు,నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది.