మార్చి నుంచి నాని కొత్త చిత్రం

  • IndiaGlitz, [Thursday,January 04 2018]

గత రెండు సంవత్సరాలుగా ఏడాదికో హ్యాట్రిక్ అన్న‌ట్లుగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూ.. మ‌రో వైపు మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. కాగా, నేను శైలజ', ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ కిషోర్ తిరుమలతో నాని ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా క‌థ‌నాల ప్ర‌కారం..

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంద‌ని తెలిసింది. అలాగే మార్చి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంద‌ని స‌మాచార‌మ్‌. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తారు. ప్రస్తుతం.. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో కృష్ణార్జున యుద్ధం' సినిమా చేస్తున్నాడు నాని. అలాగే నాని మొదటి సారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న అ!' ఫిబ్రవరిలో విడుదల కానుంది.a

More News

'జై సింహా' .. సెకండాఫ్ హైలైట్ అట

బాలకృష్ణ,నయనతార హీరోహీరోయిన్లుగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘జై సింహా’.

పవన్.. ఒకరు కాదు ఇద్దరు

ఫస్ట్ లుక్,టీజర్,సాంగ్స్..ఇలా ప్రతి అంశంతోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్,

నలుగురు టాప్ హీరోలతో కీర్తి ధమాకా

కేరళ కుట్టి కీర్తి సురేష్..అనతి కాలంలోనే తెలుగు,తమిళ్ ఇండస్ట్రీలలో టాప్ కథానాయికలలో

వేసవిలో రానా సందడి

రొటీన్ కథలకి భిన్నంగా కథలను ఎంచుకుంటూ తన సినీ ప్రయాణాన్ని సాగిస్తున్న నటుడు రానా.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తారామణి'

డి.వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యస్వంత్ మూవీస్ ప్రెసెంట్స్ సగర్వంగా సమర్పించు చిత్రం 'తారామణి'   ఈ చిత్రం తమిళంలో చిన్న సినిమా గా విడుదలయ్యి బిగ్గెస్ట్ హిట్ సాధించి భారీ కలెక్షన్స్ ను  రాబట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం నిర్మాత డి. వెంకటేష్ అందించనున్నారు.