close
Choose your channels

మార్చి నుంచి నాని కొత్త చిత్రం

Thursday, January 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గత రెండు సంవత్సరాలుగా ఏడాదికో హ్యాట్రిక్ అన్న‌ట్లుగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూ.. మ‌రో వైపు మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ యువ క‌థానాయ‌కుడు. కాగా, నేను శైలజ`, ఉన్నది ఒకటే జిందగీ` సినిమాలతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ కిషోర్ తిరుమలతో నాని ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా క‌థ‌నాల ప్ర‌కారం..

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంద‌ని తెలిసింది. అలాగే మార్చి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంద‌ని స‌మాచార‌మ్‌. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తారు. ప్రస్తుతం.. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో కృష్ణార్జున యుద్ధం` సినిమా చేస్తున్నాడు నాని. అలాగే నాని మొదటి సారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న అ!` ఫిబ్రవరిలో విడుదల కానుంది.a

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.