close
Choose your channels

Nandamuri Taraka Ratna : అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఎక్మోపై చికిత్స, బెంగళూరులోనే బాలయ్య

Saturday, January 28, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితిపై అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా వున్నట్లుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. ఎక్మో ద్వారా తారకరత్నకు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే తారకరత్నకు బీపీ అధికంగా వుండటంతో అంతర్గతంగా బ్లీడింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిని నియంత్రించడానికి వైద్య బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. మరో 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని వైద్యులు అంటున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

లోకేష్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:

కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో నిన్న యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అంతకుముందు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కుప్పం చేరుకున్నారు. ఆమె నిర్ణయం మేరకు బెంగళూరుకు ఆయనను తరలించారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు తారకరత్న సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు బెంగళూరులోని నారాయణ హృదయాలయకు చేరుకోనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.