ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ మృతి

అనారోగ్యంతో సినీ నటుడు నర్సింగ్ యాదవ్ సోమజిగూడా యశోద ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే గ‌త కొంత‌కాలంగా ఆయనకు డ‌యాలిసిస్ జ‌రుగుతోంది. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ నటించారు. దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన హైదరాబాద్‌లో 1963 మే 15న రాజయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు.

నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, కుమారుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు. నర్సింగ్ యాదవ్ మొదటి సినిమా విజయ నిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన ‘హేమాహేమీలు’. కాగా.. ‘క్షణక్షణం’, ‘మనీ’ సినిమాలు నర్సింగ్ యాదవ్‌కు మంచి బ్రేక్ ఇచ్చాయి. అలాగే  గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన కేర‌క్ట‌ర్ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. 

మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు చాలా సినిమాల్లో అవకాశమిచ్చారు. 1997లో వచ్చిన ‘దౌడ్’ అనే హిందీ సినిమాలో నర్సింగ్ యాదవ్ నటించారు. ఆయన పూర్తి పేరు మైలా నరసింహ యాదవ్ . కానీ ఇండస్ట్రీలో ఆయన నర్సింగ్ యాదవ్‌గా స్థిరపడిపోయారు. కామెడీ విలన్‌గా.. విలక్షణ నటుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. రజినీకాంత్ నటించిన ‘బాషా’ సినిమాలోనూ ఆయన మంచి కేరెక్టర్ చేశారు. ఇటీవల మెగాస్టార్ రీ ఎంట్రీ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150లోనూ నర్సింగ్ యాదవ్ న‌టించారు.

More News

రిపబ్లిక్ గిఫ్ట్ రెడీ చేస్తున్న రాజమౌళి

ద‌ర్శ‌కధీరుడు ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందిస్తోన్న పిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)’. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది.

తేజ సినిమా నుండి తప్పుకున్న గోపీచంద్

హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ ఒకానొక ద‌శ‌లో స‌క్సెస్‌లు లేక ఖాళీగా కూర్చుంటే డైరెక్ట‌ర్ తేజ త‌న‌ని జ‌యం, నిజం వంటి సినిమాల్లో విల‌న్‌గా చూపించి త‌న‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌కు తీసుకొచ్చి

‘నల్లమల’మోషన్ పోస్టర్ విడుదల

కొన్ని కథలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ తోనే రూపొందుతోన్న సినిమా ‘నల్లమల’.ఇప్పటికే సేవ్ నల్లమల అనే నినాదంతో

ఆ రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించనున్న పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది.

జనవరి 1న 'కాళికా' చిత్రం విడుదల

నట్టి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి,సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా