close
Choose your channels

ఆ రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించనున్న పవన్..

Thursday, December 31, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ రెండింటినీ ఒకేసారి పట్టాలెక్కించనున్న పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతోంది. పిరియాడికల్ స్టోరీ ఆధారంగా క్రిష్ ఈ సినిమాను రూపొందించబోతున్నారు. మొఘల్ పరిపాలనా కాలానికి చెందిన ఈ కథలో పవన్ ఓ గజదొంగగా నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ ఇప్పటి వరకూ దాదాపు ఇలాంటి పిరియాడికల్ మూవీని చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే రాజుల కాలం నాటి సినిమాల్లో పవన్ ఇప్పటి వరకూ నటించలేదు. పైగా ఒక గజదొంగగా పవన్ నటించడం ఇదే తొలిసారి.

కాగా.. ఈ సినిమాకు `విరూపాక్ష`, `గజదొంగ`, `ఓం శివమ్` అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ ముగియడంతో... మరో నాలుగు రోజుల్లో పవన్ ఈ సినిమాను లైన్‌లో పెట్టనున్నారని సమాచారం. జనవరి నాలుగో తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు పవన్ రాబోతున్నారట. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ఇప్పటికే చిత్రబృందం భారీ సెట్‌ను వేసిందని సమాచారం. అయితే పవర్ స్టార్.. ఈ సినిమాతో పాటే ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రీకరణను కూడా మొదలుపెట్ట బోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా సాయి పల్లవి నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.