అక్టోబర్ 1న వస్తోన్న నాగశౌర్య 'నీ జతలేక'

  • IndiaGlitz, [Thursday,September 29 2016]

ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. చౌదరి శ్రీ సత్యవిదుర మూవీస్‌ బ్యానర్‌ను స్ధాపించి తొలి ప్రయత్నంగా యంగ్‌ సక్సెస్‌ఫుల్‌ హీరో నాగశౌర్యతో 'నీ జతలేక' చిత్రాన్ని నిర్మించారు. పారుల్‌ గులాటి మీరోయిన్‌గా లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి. చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఆడియో ఆల్‌రెడీ విడుదలై సూపర్‌హిట్‌ అవడమే కాదు ప్లాటినం డిస్క్‌ను కూడా సాధించింది. అలాగే ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌కి టెరిఫిక్‌ రెస్పాన్స్‌ రాబట్టుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 1న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా....

నిర్మాత జి.వి. చౌదరి మాట్లాడుతూ - ''ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. కానీ మా చిత్రంలోని ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి కథ స్క్రీన్‌పై రావడం ఇదే ఫస్ట్‌టైమ్‌. ఈ చిత్రం టైటిల్‌ కథకి పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌. ఇప్పటివరకు నాగశౌర్య చేసిన చిత్రాలన్నిం టికంటే ఈ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి సీన్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. లారెన్స్‌ దాసరి కథ చెప్పిన దానికంటే సినిమా బాగా తీశాడు. విస్సు కె. కెమెరా వర్క్‌ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. స్వరాజ్‌ సంగీతం, శేఖర్‌ విఖ్యాత్‌ సంభాషణలు, రఘు మాస్టర్‌ కొరియో గ్రఫి, లారెన్స్‌ దాసరి డైరెక్షన్‌ సినిమాకు హైలైట్స్‌గా నిలు స్తాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా రాణిస్తానని పూర్తి కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ఫ్యామిలీ ఆడి యన్స్‌ అందరికీ నచ్చే ప్యూర్‌ ఫిల్మ్‌. 175 థియేటర్లుకు పైగా అక్టోబర్‌ 1న గ్రాండ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

నిర్మాత నాగరాజు గౌడ్‌ చిర్రా మాట్లాడుతూ - ''ప్రేక్ష కులు ఎంటర్‌టైన్‌ అయ్యేలా 'నీ జతలేక' చిత్రాన్ని నిర్మిం చాం. చాలా స్టైలిష్‌గా వుంటుంది. సాంగ్స్‌ పిక్చరైజేషన్‌ అద్భుతం. ప్రతి సీన్‌ చాలా ఫ్రెష్‌గా వుంటుంది. నాగ శౌర్య ఈ చిత్రంలో న్యూ లుక్‌లో కనబడతాడు. దాసరి లారెన్స్‌ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్నాయి. ఈ చిత్రం నాగ శౌర్యకి సూపర్‌హిట్‌ చిత్రం అవుతుంది. అక్టోబర్‌ 1న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

More News

త‌మిళ్ లో సెకండ్ మూవీకి సైన్ చేసిన రాశీ

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న అందాల క‌థానాయిక రాశీ ఖ‌న్నా.

ప‌వ‌న్ - ఎ.ఎం.ర‌త్నం మూవీ డీటైల్స్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని డాలీ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్  మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు.

ప‌వ‌న్ చెల్లెలు త‌ల్ల‌య్యింది

ప‌వర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చెల్లెలుగా అన్న‌వ‌రం సినిమాలో న‌టించిన సంధ్య అందిరికీ గుర్తుండే ఉంటుంది. కాద‌ల్ చిత్రంతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన ఈ న‌టి తెలుగు, త‌మిళంతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో కూడా ప‌లు చిత్రాల్లో న‌టించింది.

శాత‌క‌ర్ణి సీడెడ్ హ‌క్కులు ఎవ‌రివంటే

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌హేష్‌ను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్ర‌మ్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటేనే క్రేజీ...వీరి కాంబినేష‌న్ లో గ‌తంలో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు విడుద‌ల‌య్యాయి. త్రివిక్ర‌మ్ డైలాగ్ ను మ‌హేష్ చెప్పే మాడ్యులేష‌న్ లెక్క ప‌రిగా ఉంటుంది కాబ‌ట్టే ఈ కాంబినేష‌న్‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌పై తీసుకురావడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.