close
Choose your channels

కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్.. మహారాష్ట్ర బాటలోనే కర్ణాటక..

Wednesday, December 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా వైరస్ కొత్త రూపు సంతరించుకుని ప్రపంచాన్ని మరోసారి భయాందోళనలలోకి నెట్టేసింది. యూకేలో ఉత్పరివర్తనం చెందిన ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పలు దేశాలు బ్రిటన్‌కు విమాన రాకపోకలను నిలిపివేశాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాలతో పాటు.. ఆయా దేశాల్లోని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. భారత్ విషయానికి వస్తే మహారాష్ట్రలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూని విధించగా.. తాజాగా కర్ణాటక కూడా అదే బాట పట్టింది. బుధవారం నుంచి కర్ణాటక కూడా నైట్ కర్ఫ్యూని విధించేందుకు సమాయత్తమైంది.

ఇటీవల యూకే నుంచి భారత్‌కు తిరిగొచ్చిన వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఇది జనవరి 2 వరకు అమల్లో ఉంటుందని కర్ణాట ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. యూకే నుంచి వచ్చే ప్రయాణికులందరూ 72 గంటల్లోగా తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు.

కాగా.. కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ.. యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ ను కట్టడి చేసేందుకే నైట్ కర్ఫ్యూ విధిస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను కూడా మానిటర్ చేస్తున్నామని.. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి ఫంక్షన్లను, ఈవెంట్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే క్రిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై కూడా కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.