నిఖిల్ రెండు చిత్రాలు అలాగే..

  • IndiaGlitz, [Friday,March 09 2018]

యువ క‌థానాయకుడు నిఖిల్ గ‌త రెండేళ్ళుగా ఏడాదికో సినిమాతో సంద‌డి చేసారు. అయితే ఈ ఏడాది మాత్రం రెండు సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. విశేష‌మేమిటంటే.. ఆ రెండు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలు కావ‌డం. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ఈ నెల 16న నిఖిల్ తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' విడుద‌ల కానుంది.

శ‌ర‌న్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా.. క‌న్న‌డంలో మంచి విజ‌యం సాధించిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్‌గా తెర‌కెక్కింది. సంయుక్త హెగ్డే, సిమ్ర‌న్ పరింజా హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా గత నెల 9న విడుద‌ల కావాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు 16న రిలీజ్ కాబోతోంది.

అలాగే ఈ ఏడాదిలో మ‌రో సినిమాతో నిఖిల్ సందడి చేసే అవ‌కాశ‌ముంది. అయితే అది కూడా రీమేక్ చిత్రం కావ‌డం గ‌మ‌నార్హం. త‌మిళంలో విజ‌యం సాధించిన 'క‌ణిత‌న్' ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'ముద్ర' అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది. మొత్త‌మ్మీద‌.. ఈ ఏడాదిలో వ‌చ్చే నిఖిల్ రెండు చిత్రాలు కూడా రీమేక్ కావ‌డం విశేషం.

More News

'కొండవీటి దొంగ' కు 28 ఏళ్ళు

''ఉన్నవాడిని కొల్లగొట్టి లేనివాడికి పెట్టు" అనే రాబిన్ హుడ్ సిద్ధాంతంతో తెరకెక్కిన చిత్రం 'కొండవీటి దొంగ'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచిన హిట్ మూవీ ఇది.

మీ లైక్స్ కోసం ఇలా చేయకండి: శ్రీకాంత్

ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్న అకృత్యాలను చూస్తుంటే మీడియా పైనే విసుగుపుట్టేలా అనిపించడం ఖాయం.. వారి వీడియోలకు లైకులు రావడం  కోసం, వ్యూస్ పెరగడం కోసం కొన్ని సంస్థలు చేస్తున్న తీరు ఆడియోన్స్ నే కాదు సెలెబ్రెటీలను సైతం చిరాకు తెప్పిస్తోంది..  గాసిప్స్  అంటే కొంత తెలిసి మరికొంత తెలియని విషయాన్ని ఆరోగ్యకరంగా చెప్పడమో.. లే

విడుదలకు సిద్ధమైన మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.

నాలో ప్రేమ‌ నువ్వేనా లొగొ లాంఛ్

జై చిరంజీవ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వాసు దేవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తొన్న చిత్రం‌ "నాలో ప్రేమ నువ్వేనా". చిత్రీకరణ పూర్తి చెసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

విజ‌య్ దేవ‌ర‌కొండ 'నోటా'

నోటా అంటే రాజ‌కీయాల్లోని వ్యక్తుల‌కు బాగా తెలుసు. న‌న్ ఆఫ్ ది అబౌ అప్ష‌న్‌. పైన ఉన్న వ్య‌క్తులు కారు అనే అర్థంలో ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ నోటా ఓటును ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసింది.