నిఖిల్ పెళ్లి.. పెళ్లి ఎక్క‌డంటే..?

  • IndiaGlitz, [Wednesday,May 13 2020]

హీరో నిఖిల్ పెళ్లి మ‌రోసారి వాయిదా ప‌డిందంటూ వ‌చ్చిన వార్త‌లో నిజం లేదని సినీ వ‌ర్గాల స‌మాచారం. తాజా స‌మాచారం మేర‌కు రేపు(మే 14న‌) నిఖిల్ డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏప్రిల్ 16న నిఖిల్ డాక్ల‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌ను పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. అయితే క‌రోనా ప్ర‌భావంతో పెళ్లిళ్లు చేసుకోరాద‌ని ప్ర‌భుత్వం ఆర్డ‌ర్స్ పాస్ చేసింది. దీంతో నిఖిల్ పెళ్లి వాయిదా ప‌డింది. దీంతో వీరివురి కుటుంబ పెద్ద‌లు మే 14న పెళ్లి చేయాల‌నుకున్నారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగించింది. దీంతో మ‌రోసారి నిఖిల్‌, ప‌ల్ల‌వి వ‌ర్మ‌ల పెళ్లి వాయిదా వేసుకోవాల‌నుకున్నారు. అయితే ఇంట్లోని పెద్ద‌లు పెళ్లిని రేపే చేసేయాల‌ని నిశ్చ‌యించార‌ట‌.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నిఖిల్ పెళ్లిని హైద‌రాబాద్ న‌గ‌ర శివారు ప్రాంత‌మైన శామీర్‌పేట‌లోని ఓ పామ్ హౌస్‌లో చేస్తున్నార‌ట‌. రెండు కుటుంబాల‌కు చెందిన బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు 15 మంది కంటే ఎక్కువ కాకుండా హాజ‌ర‌వుతున్నార‌ట‌. ఈ ముహూర్తాన్ని మిస్ చేస్తే మూడం వ‌చ్చేస్తుంద‌ని పెద్ద‌లు భావించ‌డం వ‌ల్ల‌నే నిఖిల్‌, ప‌ల్ల‌వి వ‌ర్మ‌ల పెళ్లి నిరాడంబ‌రంగానే చేసేస్తున్నారు. ఈరోజు రాత్రి(బుధ‌వారం)కి నిఖిల్‌ను పెళ్లి కొడుకుని చేస్తున్నార‌ట‌. రేపు ఉద‌యం పెళ్లి ఉంటుంద‌ని స‌మాచారం.

More News

'రాములో రాముల..' సాంగ్ రికార్డ్‌

ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లోని పాట‌ల్లో ‘అల వైకుంఠ పుర‌ములో’ సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాకు రాలేదు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన

బాలీవుడ్ రీమేక్‌లో రాజ్ త‌రుణ్‌

ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన రాజ్‌త‌రుణ్ తర్వాత మంచి విజయాలను దక్కించుకుని హీరోగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.

మ‌రోసారి త్రిష‌కు చిరు ఛాన్స్ ఇస్తాడా?

మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమాలో త్రిష జోడీ క‌ట్టింది. దాని త‌ర్వాత చిరు 152వ చిత్రం ‘ఆచార్య‌’లోనూ జోడీ క‌ట్టాల్సింది. అయితే చివ‌రి నిమిషంలో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో త‌ప్పుకుంటున్న‌ట్లు

మలయాళ రీమేక్‌లో ప‌వ‌న్‌..?

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టారు.

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ ఎల్‌జీ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది కన్నుమూసిన విషయం విదితమే. తెల్లారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు అప్రమత్తమవ్వడంతో మరణాలు చాలానే తగ్గాయి.